* దివిసీమ పెను ప్రమాదానికి 47 ఏళ్లు
 * అల్లకల్లోలమైన తెలుగు రాష్ట్రాలు
 * 50 నుంచి 60 వేల మంది మృతి
* కోట్లల్లో పంట నష్టం  


ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. గత పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఖమ్మం మరియు విజయవాడ నగరాలు మునిగిపోయిన సంగతి తెలిసిందే.  తెలుగు రాష్ట్రాలకు వరదలు... ఇలా రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలాసార్లు అనేక రకాల తుఫాన్లు వరదలు వచ్చాయి. దీంతో రైతులకు అలాగే జనాలకు చాలా వరకు నష్టం వాటిల్లింది.

 

అలా చూసుకున్నట్లయితే.. ఏపీ ని ముంచేసింది దివిసీమ ఉప్పన. ఈ సంఘటన జరిగి దాదాపు 47 సంవత్సరాలు పూర్తయింది.  ఈ దివిసీమ ఉప్పెన కారణంగా దాదాపు 50,000 మంది మరణించినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో... ఈ పెను ప్రమాదం జరిగింది. దీంతో తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ దివిసీమ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది.


 1977 సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఈ ఉప్పెన.... భారతదేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటనలో దాదాపు...  వందల కుటుంబాలు వరదల్లో కొట్టుకుపోయినట్లు.. ఇప్పటికీ చెబుతూ ఉంటారు. 1997 నవంబర్ మాసంలో ఈ దివిసీమ ఉప్పెన... వచ్చినప్పుడు సముద్రం తాడిచెట్టు  కంటే ఎత్తుగా ఉప్పొంగినట్లు  ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. చాలా నగరాలలో వరద బీభత్సం సృష్టించింది.

 అయితే ఈ దివిసీమ ఉప్పెన... కుదిపేసిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు.  ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నందమూరి ఎన్టీఆర్ చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఆ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఇందిరాగాంధీ చాలా కష్టపడ్డారు.  గుట్టలు శవాలు పడుతున్న సందర్భంగా... ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు ఇందిరాగాంధీ. అయితే ఈ విషాద సంఘటన ఇప్పటికీ జనాలు మర్చిపోలేకపోతున్నారు. అంతేకాదు ఈ ఉప్పెన బారిన పడ్డ చిట్టచివరి గ్రామంలో.. తుఫాను మృతుల స్మారకాన్ని కూడా.. నిర్మించింది అప్పటి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: