సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దరణాలకు వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు జరుగుతున్న.. మీటు అంటూ ఎంత ప్రచారం నడుస్తున్నా.. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేస్తున్న.. వారిపై దురాగతాలు మాత్రం ఆగటం లేదు. మరీ దారుణంగా రాజకీయ నాయకులు కూడా మహిళలపై అత్యాచారాలు చేస్తూ వార్తలకు ఎక్కుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. పార్టీకి చెందిన ఓ మహిళ నేతపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏ క్రమంలోనే ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో యువతి కూడా తనను ఓ రాజకీయ నేత అత్యాచారం చేశాడని ఆరోపించడం సంచలనంగా మారింది.


ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లాలో 18 ఏళ్ల యువతిపై దాదాపు యేడాది కాలంగా జరుగుతున్న దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాజవాది పార్టీకి చెందిన స్థానికనేత తనపై ఏడాదికాలంగా అత్యాచారానికి ఒడిగడుతున్నట్టు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సమాజవాది పార్టీ స్థానికనేత, న్యాయవాది అయిన వీరేంద్ర పాల్ బాధిత యువతిని వలలో వేసుకుని ఆమెకు ఒక రోజు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి కారులో నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. దీనిని వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఏడాదికాలంగా ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.


ఆమె జీవితాన్ని నాశనం చేయడంతో పాటు.. ఆమె దగ్గర నాలుగు లక్షలు కూడా దోచుకున్నట్టు యువతీ ఆరోపిస్తుంది. చివరిసారిగా అతనిని జూలై 16, 17 తేదీలలో ఒక హోటల్లో కలుసుకున్నానని.. అక్కడ కూడా తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. బాధితురాలు అతడికి న్యాయపరమైన అంశాలలో సహకరిస్తూ ఉండేదని పోలీసులు తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: