వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన మహిళ నేత మాజీ మంత్రి విడుదల రజిని హడావుడి ఒక రేంజ్ లో ఉండేది. ఎక్కడ చూసినా ఆమె హంగామానే కనిపించేది. ఇక సోషల్ మీడియాలో అయితే.. రజని ఫోటోలు ... వీడియోలకు లెక్కే ఉండేది కాదు. అలాంటి రజనీకి ఇప్పుడు దిమ్మతిరిగే షాక్ లు తగులుతున్నాయి. అసలు గత ఎన్నికలలోనే ఆమెకు చిలకలూరిపేట సీటు ఇచ్చేందుకు జగన్ ఇష్టపడలేదు. అయితే చివరలో ఆమె సజ్జలతో లాబీయింగ్‌ చేసుకుని.. గుంటూరు పశ్చిమ సీటు దక్కించుకున్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. పార్టీ ఓడిపోయినా నన్ను గెలిపిస్తే తర్వాత జనసేనలోకి వెళ్ళిపోతాను అని ప్రచారం చేసుకున్నా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనాలు రజినీని ఏకంగా 53,000 ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించారు.


ఆమెపై రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని పిడుగురాళ్ల మాధవి సంచలన విజయం సాధించారు. అస‌లు వైసీపీ అధికారం లో ఉన్న‌ప్పుడు ర‌జ‌నీ కి వైసీపీ అధిష్టానం తో పాటు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌... చివ‌ర‌కు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి లాంటి వాళ్లు అలాంటి ఇలాంటి ప్ర‌యార్టీ ఇవ్వ‌లేదు. ఆమె ఇష్టం వ‌చ్చిన‌ట్టు గా కూడా న‌డిపించారు. అయితే ఆమెకు అంత ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతోనే తీవ్ర వ్య‌తిరేక‌త కొని తెచ్చుకున్నారు. అందుకే చిల‌క‌లూరిపేట లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామ‌న్నంత వ్య‌తిరేక‌త ఆమెకు వ‌చ్చేసింది.


ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ర‌జ‌నీ అస్స‌లు ఎక్క‌డా క‌న‌ప‌డడం లేదు. అయితే మ‌ధ్య‌లో పార్టీ మారిపోతాం అంటూ ఆమె లీకులు ఇచ్చుకున్నార‌న్న చ‌ర్చ కూడా న‌డిచింది. కేవ‌లం పార్టీలో ఎక్కువ .. మ‌రింత ప్రాధాన్య‌త ఇస్తార‌న్న ఉద్దేశంతోనే ఆమె ఇలా చేసింద‌న్న చ‌ర్చ కూడా న‌డిచింది. పార్టీ ఎలాగూ ప్ర‌తిప‌క్షంలో ఉంది... ఈ టైంలో పార్టీలో మ‌రింత పెద్ద పోస్టు కొట్టేసి మ‌రింత‌గా హైలెట్ అవ్వాల‌న్న ఉద్దేశంతోనే ర‌జ‌నీ పార్టీ మారుతున్న‌ట్టు లీకులు ఇస్తున్నార‌న్న టాక్ ఉంది. ఒక్కోసారి పూర్తిగా సైలెంట్ అవ్వ‌డం వెన‌క ఈ గేమ్ ప్లాన్ కూడా ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: