ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి నియోజకవర్గం లో మంచి పేరు సంపాదించుకున్న జెసి కుటుంబం గురించి చెప్పాల్సిన పనిలేదు. జెసి దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పేరు చెప్పగానే రాజకీయంగా పేరు ప్రఖ్యాతలు కాకుండా మాస్ లీడర్ గా కూడా పేరు సంపాదించారు. తన తండ్రి రాజకీయ వారసత్వం నుంచి 1985లో జెసి దివాకర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలవడం జరిగింది. 2004 నుంచి 2006 వరకు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారట దివాకర్ రెడ్డి.


2010 కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రివర్గంలో కూడా చోటు లభించుకున్నారు. 2011లో ప్రోటీన్స్ స్పీకర్ గా కూడా పనిచేశారట. 2014లో టిడిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి mp గా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలలో తన కొడుకు జెసి పవన్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించిన ఓడిపోయారు. అయితే ఇప్పుడు 2024లో మళ్ళీ పవన్ రెడ్డి అక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే గత కొన్నేళ్లుగా జెసి దివాకర్ రెడ్డి బయట ప్రపంచానికి కూడా పెద్దగా కనిపించలేదు.అలాగే పొలిటికల్ కామెంట్లు కూడా ఎక్కడ ఈయన గురించి వినపడలేదు.


ఎక్కడ కూడా కనిపించలేదు కానీ దివాకర్ రెడ్డి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ ఫోటో చూసిన తర్వాత అందరూ ఏంటి జెసి దివాకర్ రెడ్డి ఇలా అయిపోయారు అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. వైరల్ అవుతున్న ఫోటోలు జెసి పవన్ రెడ్డి తో పాటు దివాకర్ రెడ్డి ఉండడం గమనార్హం. అయితే జెసి దివాకర్ రెడ్డి ఇలా అయిపోవడానికి ముఖ్య కారణం అనారోగ్య సమస్యలు అన్నట్లుగా టిడిపి వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. చాలా బక్క చిక్కిపోయి నీరసంగా అనిపిస్తున్నట్టు కనిపిస్తోంది దివాకర్ రెడ్డి. దివాకర్ రెడ్డి లోని గంభీర్యం ఈ ఫోటోలలో ఎక్కడ కనిపించడం లేదు. దివాకర్ రెడ్డిని ఇలా చూసి ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: