ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్‌ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, మన డబ్బును కొట్టేసే నేరాలు చాలా పెరిగాయి. ఈ నేరగాళ్లు మనల్ని మోసం చేసి, మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. వీళ్లు ఎక్కడ ఉన్నా, మన ఖాతాలను ఈజీగా హ్యాక్ చేసి డబ్బు తీసుకుంటున్నారు. ఇలా చేయడానికి వీళ్లు మనకు ఫోన్‌కు SMS లేదా ఇమెయిల్‌లో వైరస్ ఉన్న ఫైల్స్, లింక్స్‌ పంపిస్తారు. ఇలాంటి మోసాల గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పుడు కస్టమర్లు అందరినీ హెచ్చరిస్తోంది.

బ్యాంకు అకౌంట్స్‌ నుంచి డబ్బును కాజేసే క్రిమినల్స్ ఎస్‌బీఐ కస్టమర్ల ఫోన్‌కు, అలానే ఇమెయిల్‌లో ఫేక్ మెసేజ్ లు పంపుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారులమంటూ కస్టమర్లను మోసం చేయాలని చూస్తున్నారు. ఇటీవలే, sbi నుంచి ఉచిత బహుమతులు వస్తున్నాయని చెప్పి అమాయకులను మోసం చేసే కొత్త రకమైన నేరం బట్టబయలు అయింది. ఈ స్కామ్ కి తరలిపోయిన స్కామర్లకు చాలామంది తమ వ్యక్తిగత వివరాలు ఇచ్చి మోసపోయారు. అందుకే, sbi హెచ్చరిక జారీ చేసింది. ఫోన్‌లో, ఇమెయిల్‌లో లేదా సోషల్ మీడియాలో బహుమతుల గురించి వచ్చే సందేశాలను నమ్మకండి అని సూచించింది.

ఇప్పుడు చాలా మందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి ఫ్రీ గిఫ్ట్స్ వస్తున్నాయని చెప్పి ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్‌లో 9,980 రూపాయల విలువైన బహుమతులు గెలుచుకోవచ్చని చెప్పి, ఒక ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతున్నారు. ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే, ఫోన్‌లోకి హ్యాకర్లు ఈజీగా ప్రవేశించగలరు ఆ తర్వాత ఫోటోలు వీడియోలతో పాటు బ్యాంకు డీటెయిల్స్ కూడా తెలుసుకోగలుగుతారు. తద్వారా అన్నిటిని హ్యాక్ చేసి డబ్బులను సులభంగా తీసుకోగలరు. వాట్సాప్ లో కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్లు వస్తున్నాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. దేనిపైనా క్లిక్ చేయకూడదు. అత్యాశకు పోతే బ్యాంకులో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: