ఇవాళ ఉదయం నుంచి టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్ బాబు గురించి సోషల్ మీడియా, మెయిన్‌ స్ట్రీం మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్ బాబు అరాచకాలకు పాల్పడుతున్నాడని.....విద్యార్థులపై బౌన్సర్లతో దాడి ? చేయించాడని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే.. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విషయం ఒకసారి పరిశీలిస్తే...తిరుపతి లో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విద్యాసంస్థలు ఉన్న సంగతి తెలిసిందే.


తిరుపతిలో ఎంబీ పేరుతో  టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్ బాబు కు సంబంధించిన యూనివర్సిటీ నడుస్తోంది.  అయితే... తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ వివాదంలో చిక్కుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీ పై విజయవాడ లోని అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది.  పిల్లలకు పెట్టే భోజనం, ఫీజులు, బౌన్సర్లు దురుసు ప్రవర్తన పై పెరెంట్స్ కమిటీ అసోసియేషన్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  


డేస్ కాలర్స్ కచ్చితంగా మెస్ లోనే భోజనం తినాలని రూల్ పెట్టిందట మోహన్ బాబు యూనివర్సిటీ.  దీంతో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న వైఖరి పై వారి పేరేంట్స్‌ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇష్టాను సారము ట్యూషన్ ఫీజులు,బిల్డింగ్ పీజులు వసూలు చేస్తున్నారని కూడా మోహన్ బాబు యూనివర్సిటీ పై విజయవాడ లోని అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు  చేశారట.


లంచ్ టైమింగ్ పై అభ్యంతరాలు వచ్చినట్లు చెబుతున్నారు.  యూనివర్సిటీ లో బౌన్సర్లతో  టిచర్లు, విద్యార్లుపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.  టీచింగ్ స్టాప్ కు జీతాలు ఇవ్వకుండా వేదిస్తున్నారని ఫిర్యాదు చేసింది తల్లి తండ్రుల అసోసియేషన్. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: