తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలో ఉండగానే తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతుండడం కొసమెరుపు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వరద నష్టం అంచనాలకు సంబంధించి కేంద్ర సాయాన్ని కోరడానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం... అస్తి, ప్రాణ, పంట నష్టాలపై సీఎం రేవంత్ ప్రధాని మోదీకి సమగ్ర నివేదికను అందజేయనున్నారు. దీనికి సంబంధించిన అపాయింట్‌ను ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

సిఎంతో పాటుగా ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత మహేశ్ కుమార్ తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తుండడం విశేషం. పార్టీ పెద్దలను పీసీసీ చీఫ్ ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలవనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ చీఫ్‌ ఖర్గే, సోనియాగాంధీని కూడా రేవంత్‌ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కలువనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేకతని సంతరించుకుంది. ఈరోజు సాయంత్రం కాకపోతే రేపు కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పిసిసి చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది.  ఉంది. ఈరోజు క్లారిటీ రాకపోతే.. రేపు కూడా ఢిల్లీలోనే ఉండి ఆరు పేర్లను ఫైనల్‌ చేయనున్నారు. డిసెంబర్ 7న సిఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా ఇంకా 6 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిపై ఢిల్లీలో తర్జనభర్జనలు పడనున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. హోం మంత్రిత్వశాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్‌తో పాటు పలు కీలక శాఖలు సిఎం వద్దే ఉన్నాయి. అయితే పార్టీకి సేవలు చేసినటువంటి పలువురు సీనియర్ మంత్రులు కొందరు కేబినెట్ విస్తరణలో భాగంగా పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇపుడు ఒకింత ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: