వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దంపతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తిరువూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌రావు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ దంపతుల పై తిరువూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌రావు. వైఎస్‌ భారతి రాస్తున్న రాతలకు అనుగుణంగానే జగన్ కూస్తున్నాడని నిప్పులు చెరిగారు కొలికిపూడి శ్రీనివాస్‌రావు. ఇద్దరూ జీవిత భాగస్వాములా లేక వ్యాపార భాగస్వాములా అనే అనుమానం కలుగుతోందని కూడా బాంబ్‌ పేల్చారు.

పులివెందులలో జగన్ కు అన్నీ తానై వ్యవహరించిన సోదరుడు అభిషేక్ రెడ్డి ప్రాణాపాయంలో ఉంటే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని ఆగ్రహించారు తిరువూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌రావు. సిటీ న్యూరో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న అభిషేక్ రెడ్డిని జగన్, భారతీ కనీసం  పరామర్శించ లేదని చురకలు అంటించారు తిరువూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌రావు.


వారికున్న మానవత్వం ఏంటో ఇక్కడే తేలిపోయిందని ఎద్దేవా చేయడం జరిగింది. అభిషేక్ రెడ్డిని పరామర్శించే దగ్గర చంద్రబాబుని తిట్టే అవకాశం లేదు కాబట్టి పలకరించడానికి కూడా జగన్ వెళ్లలేదని సెటైర్లు పేల్చారు తిరువూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌రావు. నేరస్తుల్ని పరామర్శించటం వైఎస్ కుటుంబ సంప్రదాయం అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత అజెండాతో నందిగంను పరామర్శించిన జగన్ మొక్కుబడిగా వరద బాధితుల్ని పరామర్శించాడని తెలిపారు.


పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టే నందిగంను జగన్ పరామర్శించాడని ఆరోపణలు చేశారు తిరువూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌రావు..  ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని తిట్టేందుకు నందిగం సురేష్, వరద బాధితుల పరామర్శలను  జగన్ వేదికగా చేసుకున్నాడని సెటైర్లు పేల్చారు. ధవళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేయడానికి కుట్రలు చేసిన దానిలో వైఎస్‌ భారతి కూడా ఉందని ఆరోపనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: