ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో... సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం.. చేసిన పాడు పని రచ్చ చేస్తుంది. ఎన్నికల కంటే ముందు వైసీపీ నుంచి... తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం... చంద్రబాబు నాయుడు అండదండలతో విజయం సాధించారు. దాదాపు 70 సంవత్సరాలు ఉన్న ఆదిమూలం... ఓ చెండాలమైన పని చేసి ఇరుక్కున్నారు.

 

తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళ కార్యకర్తను  లైంగికంగా వేధించి... రెడ్ హ్యాండెడ్గా అందరికీ పోయారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం. మూడు రోజులపాటు ఒకే హోటల్లో... మూడు వేరువేరు గదుల్లో... బాధిత మహిళను రేప్ చేశాడట ఎమ్మెల్యే ఆదిమూలం. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలతో... బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

 

బెడ్రూంలో ఆదిమూలం చేసిన రచ్చ మొత్తం.. వీడియో రూపంలో బయటపడింది. దీంతో వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం పై వేటు వేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అటు కోర్టులో ఆదిమూలం కేసు.. నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు సమాచారం.

 

చెన్నై నుంచి రాజకీయాలు నడిపిస్తున్నారట టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో.. బిజెపి పార్టీ కి దగ్గరవుతున్నారట.  ఇందులో భాగంగానే తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, అక్కడి సీనియర్ నాయకులతో   మంతనాలు చేస్తు న్నారట ఎమ్మెల్యే ఆదిమూలం. అన్ని ఓకే... త్వరలోనే బిజెపి పార్టీలోకి జంపు అయ్యేందుకు ఆదిమూలం రంగం సిద్ధం చేసుకున్నారట. మరి దీని పై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే.. ఆదిమూలం మాత్రం బీజేపీ పార్టీలో చేరితే.. కూటమిలో చీలిక తప్పదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: