* అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్

* ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్న యువత..

* ఉచితాల మోజులో ప్రజలు.. అధికారం మోజులో నాయకులు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమిటో..?


 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉచిత పధకాల రాజ్యం నడుస్తుంది.. గత వైసీపీ ప్రభుత్వం ఉచిత పధకాలతో కాలం వెళ్ళబుచ్చింది.. మళ్ళీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి పధకాలను ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం మరింత ఎక్కువైంది.. రాష్ట్రంలో ప్రస్తుత నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా వుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిరుద్యోగులు లక్షల్లో వున్నారు.. వారిలో కూడా నిరు పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులే ఎక్కువ మంది వున్నారు..రాష్ట్రంలో పూటకో పధకం వస్తుందిగాని.. నిరుద్యోగుల భాధను తీర్చే ఉద్యోగ కల్పన మాత్రం జరగడం లేదు.. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల బాధలను అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి.. ఉచిత పధకాలు ఇస్తున్నాం కదా ప్రజలు సంతోషంగా వుంటారులే అనే భావన నాయకులలో ఏర్పడింది.. ఒక పధకం తాలూకు డబ్బులు కొద్ది రోజులే ఉపయోగపడతాయి.. అదే నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తే అతడికి జీవితాంతం అన్నం పెడుతుంది.. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లో ఫెయిల్ అయింది..అధికారంలోకి వచ్చిన మొదటిలో గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ తరువాత నిరుద్యోగులను పట్టించుకోవడమే మానేసింది..గత ఐదేళ్లుగా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకపోవడం, గ్రూప్ 2,పోలీస్ కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల ఊసు కూడా ఎత్తని పరిస్థితి.. ప్రభుత్వ ఉద్యోగ కల్పన పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి దేవుడెరుగు.. సొంత రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు నిరద్యోగులు ఉద్యోగాల కోసం వలస పోతున్నారు.. రాష్ట్రంలో ఆశించిన పెట్టుబడులు రాకపోవడం దీనికి అసలైన కారణం..


 ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా పెద్ద పెద్ద కంపెనీలు పక్క రాష్ట్రానికి తరళి పోతున్నాయి..పెట్టుబడులు పెట్టాలంటే సరైన కాపిటల్ సిటీ ఉండాలి.. మన రాష్ట్రానికి అంతటి అదృష్టం ఎక్కడిది.. జగన్ హయాంలో అమరావతి కాకుండా మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటన చేసారు..పరిపాలన అంతా వైజాగ్ నుంచి జరుగుతుంది అని గత ముఖ్యమంత్రి జగన్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. కానీ అది ప్రకటనకే పరిమితం అయింది.. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిస్థితి మారుతుంది అని అంతా భావించారు. దీనితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కలవరపెడుతుంది. ఉచిత పధకాలకే గత ప్రభుత్వం వేల కోట్లు అప్పుచేసి మరీ ఖర్చుచేసింది.. ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీ చెల్లించుటకే రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదు..మరి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అంతకంటే భారీ స్థాయిలో సూపర్ సిక్స్ అంటూ ఉచిత పధకాలను తీసుకొచ్చింది.. ఇప్పుడు ఆ పధకాల పరిస్థితి అగమ్యగోచరంగా వుంది..భవిష్యత్ లో అయిన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: