ఎక్క‌డ మైకు పుచ్చుకున్నా.. ఎక్క‌డ అవ‌కాశం ద‌క్కించుకున్నా.. గ‌త రెండు మాసాలుగా వైసీపీ అధినేత జ‌గ‌న్.. కూట‌మి స‌ర్కారు పై కీల‌క వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన  `సూప‌ర్ సిక్స్‌`ను ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తున్నారు. రైతుల‌కు ఇన్పుట్ స‌బ్సిడీ, మ‌హిళ‌ల‌కు త‌ల్లికి వంద‌నం, యువ‌తుల‌కు నెల‌కు రూ.1500 ఆడ బిడ్డ నిధి వంటివాటిని జ‌గ‌న్ గుర్తు చేస్తున్నారు. అవి ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. స‌మ‌యం ఏదైనా.. సంద‌ర్భం ఎలాంటిదైనా.. జ‌గ‌న్ నోటి నుంచి ఇవే వ‌స్తున్నాయి.


విజ‌యవాడ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతం రాజ‌రాజేశ్వ‌రి పేట‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఇవే ప్ర‌శ్నించారు. తాజాగా పిఠాపు రంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా జ‌గ‌న్ ఈ సూప‌ర్ సిక్స్‌నే పేరు పెట్ట‌కుండా ప్ర‌శ్నించారు. `నీకు ప‌దైదు వేలు.. నీకు ప‌దైదు వేలు` అంటూ క్యామెడీ చేశారు. ఈ నిధులు ఎప్పుడు ఇస్తారు? అని నిలదీశారు. ఇది ఒక‌ర‌కంగా.. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మేన‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉన్నార‌ని.. వారికి ఇవ‌న్నీ గుర్తు చేసి రెచ్చ‌గొడుతున్నార‌నేది టీడీపీ మంత్రుల మాట‌.


అయితే.. జ‌గ‌న్ ఇంత రెచ్చ‌గొడుతున్నార‌ని మంత్రులు చెబుతున్నా.. ఆ ఊపు ప్ర‌జ‌ల్లో అయితే ఎక్క‌డా క‌నిపించ డం లేదు. మ‌రి వారి వాద‌న ఎలా ఉందో తెలియాల్సి  ఉంది. ఎందుకంటే.. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా చంద్రబా బుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. రాజ‌ధాని అమ‌రావ‌తి, పోల‌వ‌రం వంటివి పూర్తి చేయ‌డం.. వంటివి చంద్ర‌బాబుకే సాధ్య‌మ‌వుతుంద‌ని భావించి ఉంటార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అలాంటి నేప‌థ్యంలో కొంద‌రు మాత్ర‌మే సూప‌ర్ సిక్స్‌కు మొగ్గు చూపించి ఉంటార‌న్న క‌థ‌నాలు కూడా ఉన్నాయి.


అయితే.. అస‌లు ప‌థ‌కాలు అమ‌లు చేయ‌ర‌ని కాదు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో మాత్రం స‌ర్కారు పింఛ‌న్ల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తోంది. కాబ‌ట్టి ఇత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు నిధుల కొర‌త వెంటాడుతోంది. ఈ విష‌యం తెలిసిన ప్ర‌జ‌లు మౌనంగా ఉన్నార‌నేది టీడీపీ నాయ‌కులు మంత్రులు చెబుతున్న మాట‌. కానీ , జ‌గ‌న్ మాత్రం రాజ‌కీయ కోణంలో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతూనే ఉన్నారు. అయినా.. జ‌నాల నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ మాత్రం రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: