ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో... టాలీవుడ్ యంగ్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి.. చంద్రబాబు దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారని ప్రచారం జోరుగానే సాగింది. మొన్న విజయవాడలో వరదలు దాటికి... పూర్తిగా మునిగింది. విజయవాడ వరదల కారణంగా చాలామంది.. తీవ్రంగా నష్టపోయారు. ప్రాణనాష్టమే కాకుండా కోట్లల్లో ఆస్తి నష్టం కూడా జరిగింది.


దీంతో చాలామంది విజయవాడ వరద బాధితులకు.. ఆర్థిక సాయం ప్రకటించారు. అటు ఖమ్మం జిల్లాలో కూడా.. వరద బాధితులకు ఆర్థిక సహాయం ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యం అనే జూనియర్ ఎన్టీఆర్... మొట్టమొదటగా స్పందించి.. రెండు రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే... ఈ ఆర్థిక సహాయం చేసిన.. చెక్కులను నేరుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారట.


ఇందులో భాగంగానే రామ్ చరణ్ తో కలిసి నారా చంద్రబాబు నాయుడును... కలవాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారట. కానీ చివరి క్షణంలో... నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లిపోయారు.  సిపిఎం నాయకులు సీతారాం ఏచూరి కి చంద్రబాబు నివాళులు అర్పించడం జరిగింది. అయితే వాస్తవంగా... జూనియర్ ఎన్టీఆర్ మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇద్దరు కలవకుండా నందమూరి కుటుంబం కుట్రలు చేసిందట.

నందమూరి కుటుంబంతో పాటు నారా చంద్రబాబు నాయుడు భార్య... నారా భువనేశ్వరి  కూడా స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే నారా చంద్రబాబునాయుడు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ కలపాలనుకున్నా.. కుదరలేదు. దీంతో మరో సారి చంద్రబాబును కలవాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారట. దేవర సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో... బిజీ బిజీ గా ఉంటున్నా రట జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: