ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ప్రస్తుతం వరదల పంచాయతీ కొనసాగుతోంది. విజయవాడ వరద బాధితులకు...  సహాయం చేయడంలో చంద్రబాబు సర్కార్  విఫలమైందని ప్రతిసారి... వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఇక దానికి కౌంటర్ గానే ఏపీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి పై దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో  ఉన్నప్పుడు వరద బాధితులకు ఎక్కడ సహాయం చేయలేదని... టిడిపి నేతలు చెబుతున్నారు. కానీ తమ ప్రభుత్వంలో వరద బాధితులకు.. భారీ స్థాయిలో  సహాయం చేస్తున్నట్లు కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు.

 అయితే ఇలాంటి నేపథ్యంలో... చంద్రబాబు అలాగే నారా లోకేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టాలీవుడ్ యాంకర్ , వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్ శ్యామల. చంద్రబాబు నాయుడు కుటుంబం రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల వరకు సంపాదించిందని... ఆ డబ్బులను ప్రజలకు పంచడంలో విఫలమయ్యారని ఈ యాంకర్ శ్యామల.. ఓ వీడియో విడుదల చేసి మరి రెచ్చిపోయింది.  తాజాగా జగన్ మోహన్ రెడ్డి... వైసీపీలో కీలక పదవులు అప్పగించారు.

రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు యాంకర్ శ్యామలకు కూడా.. వైసీపీలో కీలక పదవి ఇవ్వడం జరిగింది. వైసిపి స్పోక్స్ పర్సన్ గా... నియామకమైన యాంకర్ శ్యామల... తన పని ప్రారంభించేసింది. పదవి ఇచ్చిన ఒకటో రోజే చంద్రబాబు ప్రభుత్వం పైన నిప్పులు జరిగింది యాంకర్ శ్యామల. ప్రస్తుతం విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శలు చేశారు యాంకర్ శ్యామల.

గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా బాధితులను ఆదుకున్నారని... గుర్తు చేశారు. విశాఖలో అలాగే ఏపీలో ఎక్కడ ప్రమాదం జరిగిన బాధితులకు సరైన సహాయం జగన్మోహన్ రెడ్డి అందించారని వివరించారు. ఇప్పుడు కూడా వరద బాధితులకు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే సహాయం చేస్తున్నారని... శ్యామల చెప్పడం జరిగింది. కానీ.... చంద్రబాబు సర్కార్ మాత్రం ఎక్కడ సహాయం చేయలేదని... యాంకర్ శ్యామల విమర్శలు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: