- ఎన్నికలకు ముందే చంద్రన్న అరెస్ట్.
- వైసిపి గ్రాఫ్ తగ్గి టిడిపి గ్రాఫ్ పెరిగిందా.?
- ఆ నేతలను నమ్మడమే జగన్ చేసిన తప్పా.?


 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  రాజకీయాలు చాలా వెరైటీగా ఉంటాయి. అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవడం చాలా కష్టం. అలాంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయిన తర్వాత మొదటిసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన పాలనలో అంతగా అభివృద్ధి జరగలేదని చెప్పేసి  2019 ఎన్నికల్లో మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు ప్రజలు. మొదటిసారి పరిపాలన విభాగంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి  ప్రజల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ఇంటి వద్దకే పథకాలు అందేలా చేశారు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి దేశంలో లేనటువంటి పథకాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి  2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓటమిపాలయ్యారు. దీనికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. జగన్ ఓటమికి కారణం జగనే అని కూడా చెప్పవచ్చు. అది ఎలాగో ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 చంద్రబాబు అరెస్టు జగన్ చేసిన తప్పా.?
 ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన విషయంలో అద్భుతంగా పాలించారు. కానీ ఆయన కిందున్నటువంటి కొంతమంది మంత్రులు,ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు ప్రజలతో అంతగా మింగిల్ కాలేకపోయారు. దీనికి తోడు వాలంటరీ వ్యవస్థ. ఈ వాలంటరీలు ఉండడం వల్ల గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు కిందిస్థాయి నాయకులు ఎవరు కూడా ప్రజలతో ఇంట్రాక్ట్ కాలేకపోయారు. ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా కానీ వాలంటీర్లే తీసుకెళ్లి ప్రజలకు ఇవ్వడం వల్ల   అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆదరణ తగ్గిపోయింది.  ఇక ఇదే కాకుండా కొంతమంది చోటామోటా లీడర్లు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టుకుంటూ వారే పెద్ద మంత్రులుగా ఫీల్ అయిపోయి  మైనస్ అయ్యారు. దీనికి తోడు అరాచకాలు ఇసుక దందాలు భూ అక్రమణులు ఇలా అనేకం నడిచాయి.  ఈ విషయాలన్నీ జగన్ వరకు చేరినా కానీ ఆయన ఎవరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. అంతా మనవాళ్లే కదా ప్రజలకు పథకాలు అందితే చాలు అనే అపోహలోనే ఉండిపోయారు. కింది స్థాయిలో అవుతున్న మైనస్ను గమనించలేకపోయారు.


ఇదే కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ  వంటి కొంతమంది నేతలు ఎన్నో అరాచకాలు చేసి విపక్షాలపై దారుణంగా విరుచుకుపడేవారు. వారు మంత్రులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అలా బిహేవ్ చేయడంతో ప్రజల్లో మైనస్ అయిపోయారు. ప్రజల్లో కాదు సొంత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వారిని నమ్మలేదు.  చివరికి వారికి టికెట్లు ఇవ్వద్దని జగన్ ముందు మొరపెట్టుకున్న ఆయన మళ్లీ వారికి టికెట్లు కేటాయించడంతో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఇక ఇదే తరుణంలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం ఉందనగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కేసు బయటకు లాగడం, ఇదే సమయంలో ఆయన్ని అరెస్టు చేయించడం, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును తిట్టి ఆయన భార్యను అవమానించడం, ఆయన ఏడవడం ఇలా ఎన్నో తప్పులు చేశాడు. దీనివల్ల టిడిపికి మరింత  బలం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పవచ్చు. చంద్రబాబు అరెస్టు తరువాత  లోకేష్,బ్రాహ్మణి,భువనేశ్వరి, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి ఇలా అంతా కలిసి చంద్రబాబు కి సపోర్ట్ గా నిలిచి కూటమిగా ఏర్పడ్డారు. ఈ విధంగా వారి ఓట్లన్నీ ఒకే వేదిక పైకి వచ్చేసరికి జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: