తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి... కారణంగా ఈ వివాదంలో రేవంత్ రెడ్డి చిక్కుకోవడం జరిగింది. తాజాగా.. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం చిరంజీవి ప్రకటించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. ఈ తరుణంలోనే చిరంజీవికి శాలువా కప్పి మరి.. స్వాగతించారు రేవంత్ రెడ్డి.


 ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వంగి మరి దండాలు పెట్టారు చిరంజీవి. అయితే రేవంత్ రెడ్డికి వంగి మరి చిరంజీవి దండాలు పెట్టడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా విపరీతంగా వాడుకుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి సమావేశం  గుర్తు చేస్తూ... తెలుగుదేశం సోషల్ మీడియాను అలాగే ఆ పార్టీ నేతలను ట్రోల్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

 

గతంలో సినిమా టికెట్ల కోసం జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలవడం జరిగింది.మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ చిత్రం బృందం సభ్యులు కూడా.. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. అప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ని చూసి చిరంజీవి కూడా వంగి దండాలు పెట్టడం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి.. చేత జగన్మోహన్ రెడ్డి దారుణంగా దండాలు పెట్టించుకున్నారని సోషల్ మీడియాలో టిడిపి రచ్చ చేసింది.

 

 దానివల్ల జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత కూడా జనాల్లో వచ్చింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో చిరంజీవి కూడా అలాగే వ్యవహరించారు. మరి ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డిని తిడుతూ.. తెలుగుదేశం నేతలు ట్రోల్ ఎందుకు చేయడం లేదని వైసిపి మండిపడుతోంది. ఈ విషయంలో జనసేన నిద్రపోతోందా ? అని ప్రశ్నిస్తోంది వైసిపి.  తమకు అనుకూలంగా ఉన్న నేతలకు సపోర్ట్ గా...  వ్యతిరేకంగా ఉన్న నేతలను టార్గెట్ చేసి టోల్ చేయడం టిడిపికి అలవాటైపోయిందని.. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: