కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. పిల్లల కొరకు బడ్జెట్ లో ప్రకటించిన ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రకటించారు. పిల్లల భవిష్యత్తు కొరకు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
 
ఆన్ లైన్ లో లేదా పోస్టాఫీస్ లేదా బ్యాంక్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 1000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ విత్ డ్రాలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో మంచి ప్రతిఫలం కావాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
 
గడిచిన పది సంవత్సరాలలో ఈ స్కీమ్ ను ఏకంగా కోటీ 86 లక్షల మంది ఎంపిక చేస్తున్నారని ఆ మదుపు విలువ ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయలు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ స్కీమ్ లో పెట్టుబడులకు ఈక్విటీలో 14 శాతం ఇచ్చామని కార్పొరేట్ డెట్ లో 9.1 శాతం ఇచ్చామని ప్రభుత్వ సెక్యూరిటీలలో 8.8 శాతం చొప్పున ప్రతిఫలం ఇచ్చినట్టు తెలిపారు.
 
ఇప్పటికే ఎన్పీఎస్ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ ఆ స్కీమ్ కు అదనం అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో అకౌంట్ తీసుకుంటే 18 సంవత్సరాల తర్వాత ఆ అకౌంట్ సాధారణ అకౌంట్ గా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రముఖ పైవేట్ బ్యాంకులు ఈ స్కీమ్ ను ఆఫర్ చేస్తున్నాయి. పేరెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ స్కీమ్ లో మార్పులు చేపడతారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: