ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఎన్నికలలో గెలవడానికి సూపర్ సీక్స్ హామీలతో పాటుగా సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వల్లే గెలిచారని చాలామంది నేతలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వైసిపి పార్టీ ఓడిపోవడానికి కూటమి ఒక కారణమైతే.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఒక భాగమని చెప్పవచ్చు. తన అన్న మీదకే యుద్ధాన్ని ప్రకటించడమే కాకుండా కాస్త కూటమికి కూడా సపోర్టుగా వ్యవహరించినట్టు కనిపించింది. కానీ సీఎంగా చంద్రబాబు 100 రోజులు పూర్తి చేసుకున్న హామీలను నెరవేర్చకపోవడంతో ఒక విచిత్రమైన సరళి ద్వారా ప్రజల మధ్యలోకి తీసుకువెళ్లాల ప్లాన్ చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా పళ్లెం, గరిటతో ఒక మూత మోగిస్తూ నిరసనను తెలియజేస్తూ ధర్నా చేసేలా ప్లాన్ చేసుకుంది షర్మిల. అయితే ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన షర్మిల కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ధర్నా చౌక్ వద్ద కూడా ధర్నా చేసింది.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేని ప్రభుత్వమా లేకపోతే ప్రజలను ముంచే ప్రభుత్వము అంటూ ఈమె ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మారు కూటమిపైన విశ్వాసం కోల్పోతున్నారు అంటూ వైఎస్ షర్మిల తెలియజేసింది.


సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేలా శ్వేత పత్రం విడుదల చేయాలంటు తెలియజేసింది. సూపర్ సెక్స్ లో భాగంగా 20 లక్షలు మంది ఉపాధి కల్పిస్తామని చెప్పారు.. ఇప్పటివరకు అందుకు సంబంధించి ఎలాంటి రూపకల్పన చేయలేదు.. ప్రభుత్వంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఎలాంటివి విడుదల చేయలేదు.. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటు ఫైర్ అయ్యింది. వరద బాధితులను ఆదుకోలేదు 7 లక్షల మంది పంట నష్టం జరిగితే 2 లక్షల మందికే పంట పరిహారం ఇస్తున్నారంటు ప్రశ్నించింది. వంద రోజులైనా సరే ఇప్పటికి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదని, 18 ఏళ్ల నిండిన మహిళలకు 1500 రూపాయలు లేదని.. తాను ఇచ్చిన హామీలు గాలిలో వదిలేసారు అంటూ షర్మిల ఫైర్ అయ్యింది. రోజురోజుకి షర్మిల చేసే వ్యాఖ్యలు చంద్రబాబు కు గుదిబండలా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: