ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తాజాగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. అదేమిటంటే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ ని విడుదల చేసి తేదీ కంటే ముందుగానే దసరా సెలవులను ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మేరకు నారా లోకేష్ కూడా ఒక కీలకమైన ప్రకటనను తెలియజేశారు. అక్టోబర్ మూడవ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారు. అక్టోబర్ 13వ తేదీన చివరి సెలవుగా ఆ మరుసటి రోజు తిరిగి విద్యాసంస్థలు ఓపెన్ చేసేలా ఉంటాయని తెలియజేస్తున్నారు.



ఆంధ్రప్రదేశ్లో ఉండే పాఠశాలలను సైతం బలోపేతం చేయడానికి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని నిన్నటి రోజున ఉండవల్లిలో తన నివాసంలో నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్షలను నిర్వహించారట. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా సౌకర్యాలను కల్పించే విధంగా ఉండాలంటూ తెలియజేశారు. నవంబర్ 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను సైతం నిర్వహించి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరూ కూడా పాల్గొనాలి అంటూ నారా లోకేష్ వెల్లడించారు.


అలాగే గ్రామాలలో ఉండే గ్రంథాలయాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రంథాలయాలను సైతం మరింత బలోపేతం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నామంటూ తెలియజేశారు. అలాగే ఉద్యోగుల బదిలీలు, టెట్, మెగా డీఎస్సీ ఇతరత్ర నిర్వహణ పైన కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి అక్టోబర్ 4వ తేదీ నుంచి దసరా సెలవులు రావాల్సి ఉండగా అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి కావడం చేత ఆరోజు హాలిడే ఉంటుంది కనుక మూడవ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావించినట్లు తెలియజేశారు. మొత్తం మీద ఈసారి దసరా సెలవులు 12 రోజులు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 31న దీపావళి క్రిస్మస్ సెలవులను కూడా డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఇవ్వబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: