తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి ఏపీ రాజకీయాలను ఉద్దేశించి, సంచలన ఆరోపణలు చేసారు. కొండపైకి వెళ్లడానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఎందుకు అఫిడవిట్‌ ఇవ్వాలో తెలపాలని టీడీపీ నాయకులను కొరారు పోసాని కృష్ణమురళి. ఈ నేపథ్యంలో అసలు ఏ ఉద్దేశంతో జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు? అని నిలదీశారు. ఓట్ల కోసం ఏ అఫిడవిట్‌ లేకుండానే మీరు క్రిస్టియన్‌, ముస్లింల ఇంటికి వెళ్తారు కదా.. అప్పుడు మీరు ఎవరికైనా అఫిడవిట్‌ ఇచ్చారా? లేదంటే మిమ్మల్ని ఎవరన్నా అఫిడవిట్‌ అడిగారా? దయచేసి నా ఈ ప్రశ్నలకు చంద్రబాబును సమాధానం చెప్పాలని పోసాని మీడియా ముఖంగా ప్రశ్నించారు.

చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని పోసాని మండిపడ్డారు. అయ్యప్ప మాల వేసుకోవడం వల్లనే మందు అమ్మకాలు సరిగ్గా జరగడం లేదన్న వ్యక్తి.. ఇపుడు ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకోవడం కాస్త విడ్డురంగా ఉందని విమర్శించారు. మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని గతంలో చంద్రబాబు ఓ మసీదులో చెప్పాడని, మోదీ అంటే కేడీ, కేడీ అంటే మోదీ! అని కూడా ఎంతో ఘోరంగా తిట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసాడు పోసాని. చంద్రబాబు లాంటి వ్యక్తి వస్తాడనే అంబేడ్కర్‌ చాలా బలమైన రాజ్యాంగాన్ని రాశాడని అన్నారు.

ఇక అదంతా పక్కన బెడితే, కొడుకు నారా లోకేశ్‌ భవిష్యత్తు కోసం బాబు ఇపుడు జగన్‌ను చంపాలని అనుకుంటున్నారు! అని చాలా బలమైన, నిరాధారమైన ఆరోపణలు చేసారు పోసాని. దాంతో ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో పెను దుమారం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా, చంద్రబాబు తిరుమలను నాశనం చేయడానికి పూనుకున్నారని, ఈ విషయాన్ని భక్తులు తెలుసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, బాబుకి పవన్ తోడయ్యాడని, ఇద్దరూ కలిసి ఎప్పుడైనా జగన్ కి స్కెచ్ వేయవచ్చని, ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి జాగ్రత్తగా ఉండమని సూచించారు. కాగా ఈవ్యాఖ్యలపై ఇపుడు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇక పోసాని చివర్లో మాట్లాడుతూ... జగన్‌ పాపం ఏ పాపం చేశాడని.. ఆయన్ను ఎందుకింత హింసిస్తున్నారని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: