ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో..  ఒక్కొక్క లొసుగు బయటకు వస్తోంది. కూటమి పార్టీల మధ్య గొడవలు తెరపైకి... రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు... తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ తలనొప్పిగా మారింది. వారంలో ఏదో ఒక వివాదం కొలికపూడి శ్రీనివాస్ రావు చుట్టు తిరుగుతోంది.

తాజాగా టిడిపి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు పై ఫిర్యాదు కూడా అందింది. అదికూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న కొంతమంది జర్నలిస్టు మిత్రులు... నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పైన... ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నెగిటివ్ వార్త రాశారట. దీంతో బహిరంగంగానే రెచ్చిపోయారు టిడిపి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు.

 ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నా వెంట్రుక కూడా పీకలేడని... ప్రజల సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను తలుచుకుంటే ఒక్కడు కూడా నియోజకవర్గంలో తిరగలేడని కూడా... వార్నింగ్ ఇచ్చారు. అయితే బహిరంగంగానే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కు.. ఇతర జర్నలిస్టులను కించపరిచేలా.. మాట్లాడడంపై... అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు సీరియస్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నా యుడు వద్దకు తీసుకువెళ్లారు.

మీడియా ప్రతినిధులపై... అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు పై... ఆ నియోజకవర్గ జర్నలిస్టులు ఫిర్యాదు చేయడం జరిగింది. తమను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని... పక్క ఆధారాలతో చంద్రబాబు నాయుడుకు... జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. బహిరంగంగానే బూతులు తిడుతున్నాడని.. అలాంటి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మీడియా ప్రతినిధులు. అయితే దీనిపై.. సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారట. తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ను.. అదుపులో ఉండాలని హెచ్చరించారట. లేక పోతే తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చర్యలు తప్పవన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: