ఏపీలో గడిచిన ఇదేళ్ళ ప్రభుత్వ పాలనలో మందుబాబుల వ్యవప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. తాగడానికి మంచి మధ్య దొరకక, తాగినా తాగింది ఎక్కక నానా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే? గత ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, పాత బ్రాండ్లను పక్కన పెట్టి, కొత్త కొత్త, చెత్త చెత్త బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి మందుబాబుల ఇళ్లను, ఒళ్ళును గుళ్ళ చేసిన సంగతి విదితమే. దాంతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న మందుబాబులకు కూటమి ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పుకొచ్చింది.

విషయం ఏమిటంటే... నేటి నుండే ఇక్కడ తాజాగా మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రాష్ట్ర వాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఇక్కడ ఏర్పాటు చేయనుండగా.. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం పట్టణాల్లో 12 ప్రీమియం షాప్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజు అనేది ఇక్కడ వసూలు చేయనున్నారు. తొలి ఏడాది, పది వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు, 5లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో ఒక్కో మద్యం షాపుకు రూ.85లక్షలు వరకు వసూలు చేయనున్నారు.

ఇక ప్రీమియం స్టోర్ల సంగతి అందరికీ తెలిసిందే. కోటి రూపాయలు వరకు వసూలు చేయనున్నారు. ప్రీమియం స్టోర్లకు మినహా.. మిగిలిన మద్యం షాపులకు ఏడాదికి 10శాతం చొప్పున లైసెన్సు ఫీజు పెంచుకుంటూ వెళతారు. ఇక దీనికోసం ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చన్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 9వరకు దరఖాస్తులు స్వీకరణ జరగనుంది. 11న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ లైసెన్స్‌లు పని చేయనున్నాయి. ఇక తిరుపతిలో మాత్రం ప్రభుత్వం ప్రీమియం షాపులను కేటాయించలేదు. ఈ నేపధ్యంలోనే మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు 99 రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచేందుకే నూతన మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: