- ( టాలీవుడ్ -  - ఇండియా హెరాల్డ్ ) .


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ముగిసింది. దీక్షలో భాగంగా మంగళవారం సాయంత్రం మెట్ల ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్ గోవింద నామ స్మరణ చేస్తూ మొత్తం 3550 మెట్లు ఎక్కారు. ఈ క్రమంలోనే పవన్ తన ఇద్ద‌రు కుమార్తెలతో కలిసి కొండపైకి వెళ్లారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ డెకరేషన్ పై సంతకం చేసి మరి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఇందుకు కారణం ఏంటంటే ? పవన్ చిన్న కుమార్తె ప‌లీనా అంజ‌లి కొణిదెల‌ అన్య‌మ‌త‌స్థు రాలు..  దీనికి తోడు మైనర్ బాలిక కూడా కావడంతో అధికారులు డిక్ల‌రేషన్ కోరారు. దీంతో పలీనాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేసి మరి స్వామిని దర్శించుకున్నారు.


టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఆ ప్రక్రియ ముగించారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక పెద్ద కుమార్తె ఆద్య గురించి అందరికీ తెలిసిందే. ఇక పలీనా గురించి చాలామందికి తెలియదు .. ఆమె ఇప్పటివరకు పెద్దగా మీడియాలో కనిపించింది లేదు. పలీనా అభిమానులకు దూరంగా ఉంది .. ఆద్యమాత్రం అప్పుడప్పుడు అన్నయ్య అకీరా తో కలిసి కనిపిస్తూ ఉంటుంది. దీంతో పలీనా అంజన కొణిదెల పేరు ఆసక్తిగా మారింది. ఇక పలీనా చూడటానికి చాలా క్యూట్ లుక్స్ తో అందంగా కనిపిస్తోంది. సేమ్ తన తండ్రి పోలికలతో ఆమె ఉంది. ఇక ఆధ్య పవన్ కళ్యాణ్ మాజీ రెండో భార్య రేణు దేశాయ్ కుమార్తె కాగా .. పలినా పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లేజనోవా కుమార్తె. అన్న అన్య మతస్థురాలు కావడంతో తిరుమల డిక్లరేషన్ తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: