అక్కినేని నాగార్జున గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మొన్నటికి మొన్న ఎన్ని కన్వెన్షన్ కారణంగా దేశవ్యాప్తంగా అక్కినేని నాగార్జున ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది. ఈ బాధ నుంచి కోలుకోక ముందే... తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. అక్కినేని కుటుంబ పరువును తీశాయి. అక్కినేని కుటుంబం పరువు తీసేలా ఆమె వ్యాఖ్యలు చేయడం... దేశవ్యాప్తంగా... హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు.

 

అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమని కొండ సురేఖ ప్రకటించారు. N కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలని నాగార్జునను.. కేటీఆర్ టార్చర్ చేసినట్లు కొండా సురేఖ బహిరంగంగా ప్రకటించారు. అయితే కేటీఆర్ డిమాండ్ పట్ల నాగార్జున ఒప్పుకొని సమంతాను బలవంతం చేశారట. అయితే దానికి సమంత ఒప్పుకోకుండా... అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందని కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం జరిగింది.


అయితే ఇక్కడ అక్కినేని కుటుంబం పరువు... పోయేలాగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అయితే.. ఇలాంటి నేపథ్యంలో... టాలీవుడ్ హీరోలు ఏకమై... కొండా సురేఖను ఏకీపారేశారు. బూతులు తప్ప అన్ని తిట్లు   తిట్టేశారు. అయితే...  గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా అత్యంత దారుణంగా... వైసిపి నేతలు టార్గెట్ చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు ఉన్నారని వేధించారు. త్వరలోనే నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని స్వయంగా... జగన్మోహన్ రెడ్డి... ప్రకటించారు.


అటు జగన్ ముందు.. చిరంజీవి దండం పెట్టి మరి...  వేడుకున్న సంఘటన అప్పట్లో వైరల్ గా మారింది. అయితే ఈ రెండు సందర్భాల  లో టాలీవుడ్ హీరోలు ఎక్కడ పెదవులు తెరువలేదు. మాకేంటి సంబంధం అన్నట్లుగా.. పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవిని ఒంటరి చేశారు. కేవలం అక్కినేని నాగార్జునకు మాత్రమే పరువు ఉందని అన్నట్లుగా... టాలీవుడ్ హీరోలు చేయడం గమనార్హం. అయితే ఇప్పుడు ఇదే అంశం..  టాలీవుడ్ హీరోలను ట్రోలింగుకు గురిచేస్తుంది. నాగార్జున కోసం దిగివచ్చిన హీరోలు... చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు దిగి రాలేదని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: