గత ప్రభుత్వం వైసీపీ పాలనలో మద్యం దుకాలను గవర్నమెంట్ నడిపించింది. అయితే అలా నడిపించిన కొత్త బ్రాండ్స్ తీసుకురావడం వల్ల చాలామంది విమర్శించారు. అయితే ప్రభుత్వం మద్యం దుకాణాలు నడపడం వల్ల చాలామంది కూడా మద్యంలో నొక్కేశారు అనే విధంగా కూటమి ప్రభుత్వం విమర్శిస్తోంది. దీంతో ఏపీ లిక్కర్ స్కామ్ అంటూ పెద్ద ఎత్తున నోరు జారుతున్నప్పటికీ.. ఇక మీదట అలాంటివి జరగకూడదని కూటమి ప్రభుత్వ మరొకసారి ఒక పాత పాలసీని తీసుకువచ్చింది. షాపులను వేలం వేయడంతో పాటుగా ప్రైవేటు వ్యాపారాలు వీటిని నిర్వహించడం జరిగే విధంగా తెలియజేశారు.



అయితే ఇందులో చాలానే స్కాములు కూడా ఉన్నప్పటికీ వేలంపాటకు దరఖాస్తులకు దగ్గరే ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏర్పడుతోంది. ఏ ఏరియాలో ఉండే ఎమ్మెల్యే అనుచరులు దందాలు చేస్తూ మద్యం దుకాణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని.. మరి కొంతమంది చేస్తున్న వ్యాపారస్తులను కూడా బెదిరిస్తున్నారని విధంగా వార్తలయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ ఏరియాలో వచ్చే మద్యం షాపుకు సంబంధించి ముడుపులు ఇవ్వాలి అంటూ బెదిరిస్తున్నారట. లేకపోతే వ్యాపారంలో షేర్లు ఇవ్వాలి అనే కండిషన్ తో వ్యాపారస్తులను బెదిరించేలా చేస్తున్నారట. మరి కొంతమంది మాత్రం ఎవరు దరఖాస్తులు వేయకుండా చూసుకుంటూ  ఉన్నారట.


ప్రస్తుతం వేలంపాట అనే రూపంలో సర్కారు కూడా పెద్ద ఎత్తున రేటు పెంచేసింది.. అంతేకాకుండా బిజినెస్ చేయాలి అంటే కచ్చితంగా లాభం ఉండాలి. అలాంటిది ఇప్పుడు మద్యం ముడుపులు కడుతూ పోతూ ఉంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి కొంతమంది మద్యం వ్యాపారాలలో మెలుకువ తెలిసినవాళ్లు దరఖాస్తు చేయాలనుకున్నప్పటికీ కూడా బెదిరింపులు చేస్తూ ఉండడంతో కాస్త మధనపడుతున్నారట. దీంతో కూటమి దందాతో ఇప్పుడు చాలా తలనొప్పి ఎదురవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు మద్యం షాపు నుంచి తమకు 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారట. దీంతో మాకొద్దీ మద్యం వ్యాపారం అంటూ చాలామంది చేతులెత్తేస్తున్నారట.అయితే మద్యం వ్యాపారులు కూటమి ప్రభుత్వం గెలవడంలో కూడా ఎంతో కొంత సహాయం చేసిన ఇప్పుడు ఎమ్మెల్యేల దందాల వల్ల చాలామంది వీరికి సపోర్ట్ చేసి తప్పు చేశామనే ఫీల్ అవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: