గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దువ్వాడ శ్రీనివాస్,  ఆయన కుటుంబ కథా చిత్రం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ముఖ్యంగా మాధురి అనే మహిళ పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య ఉన్న బంధాన్ని సైతం ఎంతోమంది కించపరుస్తూ.. పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. అయినా కూడా వీరు అలాంటివి ఏవీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్నటి రోజున తిరుమల తిరుపతిలో కనిపిస్తూ దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరొకసారి వార్తలలో నిలిచారు.


ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్  తిరుమలలో జరిగిందని , ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ద్వారా వార్తలు వైరల్ కావడంతో ఈ వీడియో చూసిన మాధురి ఫైర్ అవుతూ ఆ ఛానల్ పైన తీవ్ర విమర్శలు సైతం చేసింది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.  ఈమె విడుదల చేసిన ఈ వీడియోలో ఇలా మాట్లాడుతూ.. ఏమిటా న్యూస్.. రాసేముందు కాస్త ఆలోచించి రాయాలి కదా.. అసలు నిజాలు రాయండి. అంతేకానీ మీకు తోచిన విధంగా రాస్తే .. ఎదుటివారు ఊరుకోరు. ఇతరుల పైన బురద చల్లడమేనా మీ పని అంటూ ఆ ఛానల్ ని తప్పు పట్టింది మాధురి..


న్యూస్ ఛానల్ అనేది సమాజం తలదించుకునేలా కాదు నిజాలు చూసేలా చేయాలి.  పనికిమాలిన న్యూస్ రాయడానికి కాదంటూ ఆమె ఫైర్ అయ్యింది.  ఒకవేళ  తాము నిజంగానే ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుంటే రాయాలి కానీ ఇలా నోటికి వచ్చినట్లు రాయడం ఏంటి..?  అవతలి వాళ్ళ మనసు కూడా ఎంత బాధ పడుతుందో గ్రహించాలి కదా ..అంటూ మాధురి ఫైర్ అయ్యింది. ఇలా తన ఒక్కదానికే కాదు చాలామంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని,  ఇలాంటి తప్పుడు ప్రకటన ఎప్పుడు చేయవద్దండి అంటూ ఆమె ఆ ఛానల్ కు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియోని షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: