మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఒక శిఖరం లాంటివారు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి... ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే రాజ్యసభ సభ్యులుగా... కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం మెగాస్టార్ చిరంజీవికి ఉంది.


అలాగే ప్రజారాజ్యం పార్టీ పేరుతో అప్పట్లో సంచలనం సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు హైడ్రా...భయం పట్టుకుందని... వైసిపి సోషల్ మీడియాలో... వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులోని..  ఓ ప్రముఖ వ్యాపారవేత్త... మెగాస్టార్ చిరంజీవికి చెప్పకుండా ఓ ప్రభుత్వ స్థలాన్ని.. అమ్మాడట. అయితే ఆ విషయం తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠినంగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఇప్పటికీ అక్కినేని నాగార్జున.. ఎన్ కన్వెన్షన్  ను కూల్చివేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అదే భయం పట్టుకుందట. ప్రభుత్వ స్థలం కొనుగోలు చేయడంతో... హైడ్రాధికారులు రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని... మెగాస్టార్ చిరంజీవి భయపడుతున్నారట.


ఈ విషయం ఇప్పుడు... వైసిపి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అయితే... మెగాస్టార్ తెలియక కొనుగోలు చేయడం... తప్పు కాదు... మిస్టేక్ అవుతుంది. ఒకవేళ హైడ్రా అధికారులు వచ్చినా కూడా... మెగాస్టార్ చిరంజీవి చాలా హుందాగా ఆ స్థలాన్ని అప్పగించే ఛాన్స్ ఉంటుంది.  లేకపోతే రేవంత్ రెడ్డి తో... మెగాస్టార్ చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి... ఈ విషయంలో రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: