పోలీస్ స్టేషన్‌కి వెళ్లినా అక్కడ కొన్ని బైకులు, కార్లు, ఆటోలు లాంటివి పార్క్ చేసి ఉంటాయి. వాటన్నింటిని ఓ పెద్ద గొలుసుతో కట్టి తాళం కూడా వేసి ఉండడాన్ని గమనించే ఉంటారు. ఇలా ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ఇలాంటి వాహనాల ఎన్నో కనిపిస్తాయి. అవి కొన్ని ఏళ్ల తరబడి అక్కడే వదిలేసిన వాహనాలు. వివిధ కారణాలతో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు అవన్నీ కూడా. సాధారణంగా ఏదైనా ఒక కేసులో వాహనాన్ని సీజ్ చేసినప్పుడు కొన్ని వాహనాలను విడిపించుకుంటారు. అలా సీజైన వాహనాల్లో మరి కొన్ని ఏళ్ల తరబడి పలు కేసుల కారణంగా పోలీస్ స్టేషన్‌లోనే ఉండిపోతాయి. ఇంకా సంవత్సరాల తరబడి అవి నిరుపయోగంగా ఉండటంతో రోడ్డుపై నడపటానికి వీలు కానీ విధంగా మారుతాయి. అవి స్క్రాప్‌కు తప్ప ఏ విధంగా పనికిరావు. అలాంటి వాహనాలనే పోలీసు అధికారులు వేలం ద్వారా అమ్ముతుంటారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాహనాల స్క్రాప్ పాలసీని అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 15 ఏండ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.అయితే ఇవన్నీ మోటార్ వాహన చట్టం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారని.. అందులోంచి బెస్ట్ పాలసీని తీసుకున్నాం అని తెలిపారు. పాత బకాయిలు ఉన్నా వెహికల్ స్క్రాప్ కి తీసుకెళ్తే వన్ టైం సెటిల్మెంట్ చేసేలా అవకాశం ఇవ్వాలని మోటార్ వాహన చట్టంలో ఉందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాల ప్రకారం.. సెక్షన్ 52 A ప్రకారం రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయలేని లేదని తెలిపారు.
 
ఈ క్రమంలో స్క్రాపింగ్ కోసం రాష్ట్రంలో 37 కొత్త టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.సొంత వెహికల్ 15 ఏండ్లు దాటిన తర్వాత వలంటీర్గా స్క్రాపింగ్ కోసం ఇస్తే సర్టిఫికెట్ ఆఫ్డిపాజిట్ వస్తుందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. వచ్చే రెండేండ్లలో అదే రేంజ్లో కొత్త వాహనం కొంటే దాని ఎంవీ టాక్స్ లో మినహాయింపు ఉంటుందని వివరించారు. పాత బకాయిలు ఉన్నా వెహికల్ స్క్రాప్ కి తీసుకెళ్తే వన్ టైం సెటిల్మెంట్ చేసేలా కూడా అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం 37 ఆటో మేటెడ్ టెస్టింగ్ సెంటర్స్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందని, జిల్లాలో 33, హైదరాబాద్ లో 4 అదనంగా పెట్టనున్నట్టు చెప్పారు.ఒక్కో దానికి రూ.8 కోట్లు అవసరం అవుతుండగా.. మొత్తం రూ. 296 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సారథి, వాహన్ సాఫ్ట్వేర్ను ఏడాదిలోపు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని, సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ జరుగుతున్నదని చెప్పారు. 15 ఏండ్లు దాటిన ప్రైవేట్ వాహనాలను కచ్చితంగా స్క్రాపింగ్ చేసుకోవాలనే కండిషన్ లేదని, వారి ఇష్టపూర్వకంగానే చేసుకోవచ్చునని తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు 8 ఏండ్లలోపు ప్రతి ఏటా, త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఇస్తారన్నారు. 15 ఏండ్లు దాటిన వాహనాలు స్క్రాప్ కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

#tg