ప్రముఖ వ్యాపారవేత,టాటా సన్స్ చైర్మన్, పరోపకారి రతన్ టాటా ఇటీవల తుది శ్వాస విడిచారు అన్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అయితే ఆయన మరణంతో ఇండియా మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోయామని ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోయారు. ఇక ఆయన మృతిపై వ్యాపారవేత్తలు సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


 అయితే డాగ్ లవర్ అయిన రతన్ టాటా గోవా అనే పేరు గల ఒక శునకాన్ని తన దగ్గర పెంచుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రతన్ టాటా అంత్యక్రియల వద్ద ఆయన పెంపుడు శునకం కనిపించింది. ఆయన ఇక లేరు అన్న విషయాన్ని అర్థం చేసుకుని పెంపుడు కుక్క కూడా కన్నీళ్లు పెట్టుకున్న ఘటన అందరినీ కలిచి వేసింది అని చెప్పాలి. ఇక ఆయన అంత్యక్రియల సమయంలో పెంపుడు శునకం గోవా చివరిసారిగా నివాళులర్పించడానికి కూడా వచ్చింది.


 ఇలా ఈ పెంపుడు కుక్కకి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే పెంపుడు శునకం పేరు గోవా అనే విషయం అందరికీ తెలుసు. కానీ పెంపుడు కుక్కకి గోవా అనే పేరును రతన్ టాటా పెట్టడం వెనక ఒక కారణం ఉందట. ఒకసారి రతన్ టాటా గోవా లో ఉన్నప్పుడు ఒక వీధి కుక్క అతనితో పాటు రావడం ప్రారంభించిందట. ఆ సమయంలో దాన్ని దత్తత తీసుకొని ముంబైకి తీసుకురావాలని రతన్ మనసులో ఒక ఆలోచన వచ్చిందట. ఇక ఆలోచన రావడమే తడువు.. ఆ పని చేసేసారట. ఆ శునకాన్ని దత్తత తీసుకొని.. తన వెంట తీసుకొచ్చారట. ఇలా గోవాలో ఆ శునకం దొరికింది కాబట్టి గోవా అనే పేరు పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: