గత నెల నుంచి ఎక్కువగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది. ముఖ్యంగా ఇటీవలే తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి కబురు చెబుతామంటూ తెలియజేయడంతో పాటు ఇటీవల ఒక ప్రముఖ చానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల మరొకసారి వీరి గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా వీరి గురించే రీల్స్ తెగ వచ్చేస్తూ ఉంటాయి.



వీరిద్దరికి సంబంధించి పలు రకాల రీల్స్ కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే తిరుమలలో శ్రీవారి మనోభావాలను దెబ్బతీసేలా వీరు చేశారంటూ పోలీస్ స్టేషన్లో వీరి మీద కేసు కూడా ఫైల్ అయింది.. ఈ విషయం పైన మాత్రం మాధురి స్పందిస్తూ కొండమీద తాము ఎలాంటి రీల్స్ చేయలేదని కేవలం కొంతమంది వెంటపడి తమ వీడియోలు ఫోటోలను తీసి అలా చేశారంటూ తెలిపింది. కార్యకర్తలందరితో కలిసి తిరుమలకు వెళ్లినట్లుగా చెప్పిన మాధురి.. ఆ తేదీలలో తనమీద ఎందుకు కేసు పెట్టలేదు అంటూ ఆమె ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల వల్లే కేసులు నమోదు చేస్తారా అంటూ ఆమె ఇది కేవలం రాజకీయ కుట్ర అంటూ తెలిపింది.


అయితే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం నీ బట్టి వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందనే విషయం వైరల్ గా మారుతోంది.. దువ్వాడ శ్రీనివాస వయసు 58 అయిన తన దృష్టిలో మాత్రం ఆయన వయసు 30 అంటూ తెలిపింది మాధురి. కేవలం దువ్వాడ శ్రీనివాస్ ను మంత్రిగా చూడాలన్నదే తన కల అన్నట్లుగా మాధురి తెలిపింది. దివ్వెల మాదిరి వయసు 40 సంవత్సరాలని సమాచారం.. దీంతో అటు శ్రీనివాస్, మాధురి మధ్య ఏజ్ గ్యాప్ 18 సంవత్సరాలు ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఎప్పటికీ ప్రస్తుతం ట్రెండీగా మారుతున్నారు వీరు.

మరింత సమాచారం తెలుసుకోండి: