జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉంది. మరిముఖ్యంగా సిని రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారికి ఈయన ఒక రోల్ మోడల్ గా ఇప్పుడు కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటులు పవన్ కళ్యాణ్ ను కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ విలక్షణ నటుడు షియాజీ షిండే రాజకీయాల్లో అడుగుపెట్టారు. మహారాష్ట్ర కు చెందిన ఈయన అక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిరోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ను షిండే కలిశారు. కీలక చర్చలు కూడా జరిపారు. ఇక పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతు కూడా ఇచ్చారు. ఇక అయితే పవన్ సనాతన ధర్మం పరిరక్షణ అంశాన్ని వ్యతిరేకించే వారిలో ప్రకాష్ రాజ్‌ ఒకడు.. కాని షిండే మాత్రం పవన్ కు మద్దతు తెలిపారు. నిర్మాణాత్మకమైన సూచనలు కూడా ఇచ్చారు. అయితే పవన్ కలిసిన తర్వాత ఆయన నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది. మహారాష్ట్రలో శివసేన , ఎన్సీపీ , బీజేపీ భాగస్వామి ప్రభుత్వం నడుస్తుంది ఈ క్రమంలో బిజెపి భాగస్వామ్య పార్టీ అయ‌న‌ ఎన్సీపీలో షిండే చేరటం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారనే ప్రచారం కూడా నడుస్తుంది.  అయితే ఇక్కడ పవన్ నటరత్న ఎన్టీఆర్ను గుర్తు చేస్తున్నారన్న కామెంట్లు కూడా వస్తున్నాయి.


చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలిగిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని దశాబ్దాలగా కాంగ్రెస్ పార్టీ ఏలబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను తెలుగుదేశం హస్తగతం చేసుకుంది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు దిక్కు చూసుగా మారింది. అలా ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని అనేక చిత్ర పరిశ్రమలకు చెందిన వారు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించిన ఎన్టీఆర్ ను ఇప్పటికీ అన్ని చిత్ర పరిశ్రమలు గురువుగా భావిస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన కొందరు నటులు పార్టీలు స్థాపించిన ఆయన స్థాయిలో రాణించలేకపోయారు.


తమిళనాడులో సైతం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు రాజకీయాల్లో రాణించడం సర్వసాధారణం. అయితే ఏపీలో మాత్రం ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎంతోమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి పదవులు చేపట్టారు. ప్రజాసేవ కోసం ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించేవారు ఎన్టీఆర్. ఇప్పుడు అదే పరిస్థితి పవన్ లో కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన విజయం సాధించింది. 100 శాతం విక్టరీతో అందరినీ ఆకర్షించగలిగారు. అందుకే దేశం యావత్తు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి వారంతా పవన్ ను కలిసేందుకు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే షియాజి షిండే పవన్ ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ తరువాత దేశవ్యాప్తంగా ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్న‌డు అన‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: