టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా పేరు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రజ్యోతి పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ముఖ్యంగా ఆర్కె అంటే చంద్రబాబుకు ముఖ్యమైన వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. అయితే అలాంటి మీడియా మీద గత కొద్దిరోజులుగా చాలామంది టీడీపీ నేతలు గొంతెత్తుతూ విమర్శిస్తూ ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కోలికపుడి శ్రీనివాసరావు కూడా పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా కులపర్తి ఎమ్మెల్యే భార్య సుధా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తున్నాయి.


ఇప్పుడు తాజగా తన భర్త ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రగిరికి మాత్రం తాను ఎమ్మెల్యే అంటూ చెప్పుకొచ్చారు.. తాను తిరిగి ఇక్కడ గెలిపించాలని అందుకే ఆ హామీలను నెరవేర్చ పనిలో ఉన్నానంటూ తెలిపింది సుధా రెడ్డి. కానీ తన కుటుంబం మీద చెవిరెడ్డి అన్న తన అనుచరులు కొంతమంది సోషల్ మీడియా గ్రూపులలో తమ కుటుంబం పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేసు పెట్టింది వారందరూ కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ ఫైర్ అయ్యింది. అయితే ఈ పేపర్ ఫోటోలన్నీ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ కి సంబంధించినవని ఆమె తెలియజేసినట్లుగా సమాచారం.


ఈ పేపర్లో గడిచిన కొద్ది రోజుల క్రితం తమ్ముళ్ళు ఇది తగదు అనే పేరుతో పెద్ద బ్యానర్ ని వేశారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోల పైన ఆమె సీరియస్ అవుతూ ఇలా సొంత మీడియాలోనే పలుకు కథనాలు రావడం తనకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అంటూ ఆమె ఆరోపణలు చేయడం జరిగింది.. మరి సుధా రెడ్డి కుటుంబం ఆర్కేను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది.. మరి ఈ విషయం పైన మరి ఎవరు కాంప్రమైజ్ అవుతారు లో లోపల ఏమైనా సర్దుబాట్లు జరుగుతాయా లేదా చూడాలి మరి. మొత్తానికి సొంత మీడియా మీదే టిడిపి నేత భార్య ఎదురు తిరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.అంతేకాకుండా ఆంధ్రజ్యోతిలో కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ పలు కథనాలు వెలువడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: