ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మాస్ లీడర్గా పేరున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానీ గూర్చి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి నాని దారుణంగా ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో గత కొంతకాలంగా మీడియా కు రాజకీయ వ్యాఖ్యలను ఆయన దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి కొడాలి నాని తిరుమలలో దర్శనమిచ్చారు. ఎప్పుడూ గుబురు గడ్డంతో కనిపించే నాని ఒక్కసారిగా గుండు అయ్యారు. న్యూ లుక్ తో కనిపించారు.తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు.ఆయన ప్రత్యేక తిరుమల వెళ్తుంటారు.ఇదే విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చారు.తిరుమలలో వివాదం నేపథ్యంలో చంద్రబాబుపై కామెంట్స్ చేశారు నాని.ఆయన ఏనాడైనా తిరుమలలో తలనీలాలు సమర్పించుకున్నారా అని ప్రశ్నించారు.ఇప్పుడు అదే తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించి గతానికి భిన్నంగా కనిపించారు కొడాలి నాని. వైసిపి ఓడిపోయిన నాటి నుంచి నాని లో దూకుడు తగ్గింది.గుడివాడ లో సైతం పెద్దగా కనిపించడం లేదు.విజయవాడకు పరిమితమైనట్లు తెలుస్తోంది.ఇదిలావుండగా ఎన్నికలకు ముందు చాలా రకాల వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఏపీలో చంద్రబాబు అధికారం లోకి వస్తే ఆయన కాలి వద్ద ఉండిపోతానని..బూట్లు తుడుస్తానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలుచేశారు.కుప్పం లో సైతం చంద్రబాబు ఓడిపోతున్నారని కామెంట్ చేశారు.అయితే కూటమి అంతులేని మెజారిటీతో గెలవడం తో నాని టార్గెట్ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి మరి తెలుగు యువత నాయకులు సవాల్ చేశారు. కోడిగుడ్ల తో దాడి చేశారు.రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు.చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావు అంటూ ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా అలా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని కొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తన అభిమానులు తీవ్ర నిరాశకు గరవ్వగా సాధారణ నెటిజన్లు మాత్రం తనదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: