ఆంధ్రప్రదేశ్లో వరుసగా మహిళల పైన దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏకంగా నిన్నటి రోజున ఇద్దరు ఇంటర్ విద్యార్థుల పైన దారుణమైన సంఘటనలు జరగడంతో ప్రజలు సైతం కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో ఇంటర్ విద్యార్థికి పురుగుల మందు తాగించి మరి అత్యాచారం చేసిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. ఇప్పుడు కడప జిల్లాలో జరిగిన మరొక సంఘటన భయభ్రాంతులకు గుర అయ్యేలా చేస్తోంది.



బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థి పైన పెట్రోల్ దాడి చేసిన సంఘటన ఇప్పుడు కలకలంగా మారింది. అయితే ఆ విద్యార్థిని రోడ్డు పక్కన చెట్లల్లో తీసుకువెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి మరి నిప్పంటించి వెళ్ళిపోయాడట. స్థానికంగా ఉండేవారు ఈ విషయాన్ని గమనించి ఆ యువతీని కడపలో రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.. ఈ ఘటన పైన పోలీస్ కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం తమ కుమార్తెను ప్రేమ పేరుతో ఎనిమిదవ తరగతి నుంచి విజ్ఞేశ్ అనే యువకుడు వేధిస్తూ ఉండేవారని ఆ బాధ్యత తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు.


అతడికి వివాహమైన కూడా ఈ వేధింపులు మాత్రం ఆపలేదని పోలీసులకు తెలియజేశారట. అయితే ఈ విషయం పైన అటు ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి విద్యార్థి యొక్క ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నట్లు సమాచారం.అలాగే ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి మరి ఆ నిందితుడిని శిక్షించాలి అంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారట. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లగా మున్సిపాలిటీకి చెందిన వ్యక్తులలో ఒకరని సస్పెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందనే విషయం పైన ప్రత్యేకించి నాలుగు బృందాలతో గాలించి మరి విచారణ చేపడుతున్నారట. త్వరలోనే ఈ కేసును చేదిస్తామంటూ ఎస్పీ హర్షవర్ధన్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: