ఆంధ్రప్రదేశ్ లో కొత్త లిక్కర్ పాలసీ.. ప్రభుత్వానికి సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉందనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్నీ కేంద్రీకరించి అవినీతి జరిగేదని.. ఈ ప్రభుత్వంలో వికేంద్రీకరణ స్టాండ్ లో జరుగుతుందనే కామెంట్లు ఇప్పటికే మొదలైపోయాయి. ఈ సమయంలో బాబు మాటను ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారనే విషయం వైరల్ గా మారింది.


ఏపీలో నూతన లిక్కర్ పాలసీ అని చెప్పారు కానీ.. పాత ధరలే ఉన్నాయి.. కాకపోతే అన్ని బ్రాండ్లూ దొరుకుతున్నాయి.. ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్నారు.. అంతకు మించి తేడా ఏమీ లేదంటూ ఇప్పటికే పలువురు మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు! ఈ సమయంలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించాలనే ఈ లిక్కర్ పాలసీతో సరికొత్త సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.

మద్యం, ఇసుక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ప్రభుత్వ విధానాలను అడ్డు రావొద్దని, ప్రభుత్వ విధానాలను కాదని ఎవరూ సొంతపెత్తనాలు చేయొద్దని, మద్యం వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడోద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ అధినేత, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు!


అయినా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆ హెచ్చరికలను లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తమ నియోజకవర్గాల్లో లిక్కర్ షాపు ఓపెన్ చేయాలంటే తమకు 20 నుంచి 30 శాతం వాటా ఇవ్వాల్సిందే అని కొంతమంది ఎమ్మెల్యేలు.. అసలు మీకు వ్యాపారం ఎందుకు.. మీ లైసెన్సులు మాకు ఇచ్చి గుడ్ విల్ తీసుకుని వెళ్లండి అని మరికొందరు.. లైసెన్సు దారులకు హుకుం జారీ చేస్తున్నారనే విషయం ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది!

 

ఈ విషయంలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తారతమ్యాలేమీ లేవని.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఇదే పరిస్థితి నెలకొందని.. నాయకుల దెబ్బకు కొంతమంది దుకాణాలు తెరవాలంటేనే భయపడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కొతమంది నాయకులు నేరుగా బెదిరింపులకు పాల్పడుతుంటే.. మరికొంతమంది తమ అనుచరులను పంపిస్తుంటే.. ఇంకొంతమంది పోలీసులను ఎంటర్ చేస్తున్నారని అంటున్నారు. విషయం అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తుందని.. స్వయంగా చంద్రబాబే చెప్పినా తమ్ముళ్లు వినిపించుకోకపోవడం అతిపెద్ద అప్రతిష్టను తెచ్చిపెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: