కుప్పం నియోజకవర్గంలో తాజాగా... యూనివర్సిటీ ఆహ్వాన పత్రిక రిలీజ్ అయింది. అయితే ఇందులో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరే లేదు. ముఖ్యమంత్రి అన్న ప్రోటోకాల్ మర్చిపోయిన అధికారులు... సీఎం చంద్రబాబు నాయుడు పేరును ఎత్తేశారు. కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ యూనివర్సిటీ... 27వ వార్షికోత్సవం జరగనుంది.
ఈ తరుణంలోనే ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు లేకుండా మిగతా అందరి పేర్లు... ముద్రించారు అధికారులు. కుప్పం ఎమ్మెల్యేగా... అదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును... కాలేజీ యాజమాన్యం, ఇటు అధికారులు... మర్చిపోవడం విడ్డూరంగా ఉంది. ఎవరైనా కావాలనే చంద్రబాబు నాయుడు పేరు లేకుండా చేశారని కూడా.... కొత్త చర్చ జరుగుతోంది.