ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... చాలామంది రాజకీయ నాయకులు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో జెసి దివాకర్ రెడ్డి ఒకరు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసే...  తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో... జెసి బ్రదర్ అంటే ఒక ఊపు అన్నమాట. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న... జెసి దివాకర్ రెడ్డి గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 
అది త్వరలోనే జెసి దివాకర్ రెడ్డి బయోపిక్ తెరపైకి రానందట. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్... హీరోగా చేయబోతున్నారట. అంటే జెసి దివాకర్ రెడ్డి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించబోతున్నారని సమాచారం అందుతుంది. జూటూరు రాజు పేరుతో.. ఈ సినిమా చేస్తున్నారట.  అంతేకాదు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇందులో భాగంగానే తాడిపత్రికి త్వరలోనే... ఆ దర్శకుడు వెళ్లనున్నారట. తాడిపత్రి నియోజకవర్గంలో జెసి బ్రదర్స్... గురించి తెలుసుకొని.. జెసి దివాకర్ రెడ్డి రాజకీయ అనుభవాలను... విశ్లేషించిన తర్వాత బయోపిక్ ప్రారంభించనున్నారట. అయితే బయోపిక్ కు జెసి దివాకర్ రెడ్డి కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా... 1985 సంవత్సరం నుంచి తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు జెసి దివాకర్ రెడ్డి.



ఈ లెక్క ప్రకారం ఇప్పటికీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గం నుంచి జెసి దివాకర్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. మంత్రిగా కూడా పనిచేశారు జెసి దివాకర్ రెడ్డి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వి డిపోయిన తర్వాత... జేసీ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతోంది. జెసి దివాకర్ రె డ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన కొడుకు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: