తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం మూసీ చుట్టూనే తిరుగుతున్నాయి. మూసీని సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. అందులోభాగంగా ఇప్పటికే మూసీ బాధితులను అక్కడి నుంచే తరలించే పనిని ప్రభుత్వం చేపట్టింది. అయితే.. వారిలో కొంత మంది స్వచ్ఛందంగా వెళ్లిపోగా.. మరికొంత మంది మాత్రం దశాబ్దాలుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయలేక గొడవలకు దిగారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు.


మరోవైపు.. మూసీ ప్రక్షాళలనను ముందు నుంచి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలను ఇబ్బందులు పెట్టి పర్యాటక ప్రాంతాలను నిర్మించడం అవసరమా అంటూ నిలదీస్తున్నారు. రూ.25వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్టును లక్షన్నర కోట్లతో నిర్మించేందుకు సిద్ధం అయ్యారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.  తాజాగా.. తాము మూసీకి వ్యతిరేకం కాదని, మూసీ పేరిట జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకమంటూ ప్రకటించారు.


కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తూ వచ్చారు.  సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మూసీ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్, హరీశ్ రావుల మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. గంటన్నర పాటు ప్రెస్ మీట్ లో మాట్లాడిన రేవంత్ పూర్తిగా బీఆర్ఎస్‌ను టార్గె్ట్ చేస్తూ తన స్పీచ్‌ను కొనసాగించారు.  


మూసీని కబ్జా చేసిన వారి జాబితాను తయారు చేయించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో కలిసి ఎవరెవరు కబ్జాలు చేశారు..? ఏయే కట్టడాలు నిర్మించారు..? అని లెక్కలు తీశారు.  ఈ జాబితాలో పలువురు బీర్ఎస్ పార్టీ నేతలు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  


బఫర్ జోన్ పరిధిలో తాము నిర్మిస్తున్నామని తెలిసినప్పటికీ.. వాటని పట్టించుకోలేదు.  ఇప్పుడు వారికి చెందిన ఫంక్షన్ హాల్స్, విల్లాలు ఉన్నాయి.  దీంతో హైడ్రా త్వరలోనే వాటిని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.  బీఆర్ఎస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అధికారులు తయారుచేసిన జాబితాలో ఇంకా కొంత మంది బీఆర్ఎస్ నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వారందరిలోనూ భయాందోళన మొదలైనట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: