ఆహా ఓటీటీ వేదికగా సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య హోస్టుగా చేస్తున్నటువంటి అన్ స్టాపబుల్ సీజన్-4 కి సంబంధించి మొదటి ఎపిసోడ్ ఈనెల 25 వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఇటీవలే సీఎం చంద్రబాబుతో మొదటి ఎపిసోడ్ ను కూడా షూట్ చేసినట్లు ఒక ప్రోమో ను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సీఎం చంద్రబాబుకి సంబంధించి కొన్ని రాజకీయ విషయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. బాలయ్య, చంద్రబాబు మధ్య కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు సీరియస్ అయిన సంఘటనలు ఇందులో కనిపిస్తున్నాయి.


బాలయ్య ఈ షోలో చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అలాగే తెర పైన కొంతమంది ఫోటోలను చూపిస్తూ ఇందులో మీకు ఎవరంటే ఇష్టము అనే విధంగా ప్రశ్నించే విధంగా కొన్ని ఫోటోలను సైతం చూపించారు. అయితే ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే క్రికెట్ కు సంబంధించి మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఫోటోలను చూపిస్తూ..బావ మీరు ధోని వంటి లీడర్.. నేను విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్ ను మరి ఆ ఇద్దరిలో మీరు ఎవరిని ఇష్టపడతారు అంటూ బాలయ్య చంద్రబాబును ప్రశ్నించడం జరిగింది.


ఇందుకు చంద్రబాబు సమాధానాన్ని తెలియజేస్తూ తాను ఎప్పుడూ కూడా విరాట్ కోహ్లీనే ఇష్టపడతానని తెలియజేశారు. తాజాగా ఈ ప్రోమోలో చంద్రబాబు ఇలా చెప్పడంతో ఏంటి సీఎం చంద్రబాబులో ఈ యాంగిల్ కూడా ఉందా.. పొలిటికల్ పరంగే అనుకున్నాము కానీ క్రీడా పరంగా కూడా చూస్తారా అంటూ మరికొంత మంది ఆశ్చర్యపోతు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మొత్తం పూర్తి ఎపిసోడ్ స్ట్రిమింగ్ కావాలి అంటే అక్టోబర్ 25వ తేదీన రాత్రి 8: 30 నిమిషాలకు ఆహ లో ప్రసారం కాబోతోంది. మరి ఇందులో మరిన్ని సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: