అంబానీ ఐశ్వర్యం గురించి మనం మాట్లాడుకోవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ విలాసవంతమైన జీవనశైలి కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె తాగుతున్న నీళ్ల విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. అవును, నీతా అంబానీ వాడే ప్రతి వస్తువు విలాసవంతంగా ఉంటుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇపుడు తాజాగా నీతా అంబానీ అందంగా డిజైన్ చేసిన వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వాటర్ బాటిల్ మరియు దానిలోని నీటి ధరపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి.

ఈ వాటర్ బాటిల్ విషయానికొస్తే, 24 క్యారెట్ బంగారంతో తయారు చేయబడిందిగా తెలుస్తోంది. ఇక ఆ వాటర్ బాటిల్ ధర అక్షరాలా రూ.49 లక్షలు. ఈ వాటర్ బాటిల్‌ కి ఓ పేరు కూడా ఉందండీ. అదే ‘ఆక్వా డి క్రిస్టలో ట్రిబ్యూటో ఏ మొడిగ్లియాని’. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే కస్టమర్ కోరుకున్న డిజైన్‌లో ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో రూపొందించిన బాటిల్‌ అది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఈ సీసా 24 క్యారెట్ల బంగారు కవర్‌ను కలిగి ఉంది. ఈ సీసాలో ఫ్రాన్స్, ఫిజీ నుండి వచ్చిన సహజ నీటి బుగ్గ మరియు ఐస్‌లాండ్ నుండి హిమనదీయ నీటి మిశ్రమాన్ని నింపి ఉంచుతారు. వాటిని మన నీతా అంబానీ తాగుతున్నమాట.

తాజా నివేదికల ప్రకారం, ఈ వాటర్ బాటిల్ 750 ml నీటిని కలిగి ఉంటుంది. అలాగే ఈ బాటిల్ లోపల ఉన్న నీటిలో 5 గ్రాముల బంగారం కూడా కలుపుతారు. ఈ బ్రాండ్ వాటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చెబుతూ ఉంటారు. ఈ నీటిని తగినవారికి చర్మం యవ్వనంగా ప్రకాశవంతంగా కనిపించేలా ఈ బంగారు రేణువులు సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి నీతా అంబానీ తన చర్మం యవ్వనంగా మరియు మరింత చురుకుగా ఉండటానికి ఈ బంగారు నీటిని తాగుతుందని అంటున్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని నీతా అంబానీ తాగుతుందా? అనే చర్చ ఇపుడు నెట్టింట మొదలైంది. అదేవిధంగా నీతా అంబానీ దగ్గర ఖరీదైన టీ సెట్ కూడా ఉంది. ఇందులో ఆమె రోజూ టీ తాగుతుంది.. ఇది జపాన్ ఆధారిత కంపెనీచే తయారు చేయబడింది. దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: