-  శ్యామ‌ల‌ను టార్గెట్ చేస్తోన్న వైసీపీ నేత‌లు
-  జ‌గ‌న్ ద‌గ్గ‌ర అవుతోంద‌న్న టెన్ష‌న్ తో ఇబ్బందులు పెడుతోన్న వైనం

- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .


బుల్లితెర యాంకర్ శ్యామలారెడ్డి ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే శ్యామలకు వైసీపీలో పొగ పెడుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. శ్యామల వరుసగా మూడు, నాలుగు ప్రెస్మీట్‌లు వైసీపీ కేంద్ర కార్యాలయం లో పెట్టారు. ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వైసీపీలో కొందరు జీర్ణించుకోలేని పరిస్థితి. ఏదోరకంగా ఆమెను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కొంతమంది వైసీపీ నాయకులు తెరవెనక మంత్రంగాలు నడుపుతున్నారట. ప్రకాశం జిల్లాకు చెందిన బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని శ్యామల పెళ్లి చేసుకున్నారు.


శ్యామల బ్రాహ్మణ సామాజిక‌ వర్గానికి చెందిన మహిళ. వైయస్ జగన్ పై శ్యామల దంపతులకు ఎంతో అభిమానం ఉంది. ఆ కారణంగానే వైసీపీ కష్టకాలం లో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేయాలని ముందుకు వచ్చారు. మొన్న ఎన్నికలలో శ్యామ‌ల వైసీపీ గెలుపు కోసం గట్టిగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎంతో ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు శ్యామల ముందుకు రావడంతో జగన్ ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. శ్యామల తాజాగా తనను కూటమి ప్రభుత్వం ఎలా టార్గెట్ చేస్తుందో.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సహా చక్కగా వివరించారు.


ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని.. తేల్చి చెప్పారు. శ్యామల ఇలా ఫైట్ చేయటానికి మెచ్చుకోవాల్సింది పోయి.. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతలే ఆమెను టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్ట‌డం లో ముందు ఉంటున్నారు. జగన్‌కు ఎక్కడ దగ్గరవుతుందో.. తాము ఎక్కడ దూరం అవుతామో అన్న బాధలో ఉన్న కొందరు.. శ్యామలకు చేప కింద నీరులా పొగ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: