నందమూరి తారకరత్న... అందరికీ గుర్తుండే ఉంటుంది. నందమూరి తారక రత్న... గత ఏడాది కాలం కిందట... గుండెపోటుతో మరణించారు. తెలుగుదేశం పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్న తరుణంలో తారకరత్నకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి దాదాపు 22 రోజులు... చికిత్స అందించినప్పటికీ.. నందమూరి తారకరత్న బతకలేదు. ఆయన బాడీలో కణాలన్నీ.. రియాక్ట్ కాకపోవడంతో బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో మరణించారు నందమూరి తారకరత్న.

 ప్రస్తుత ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నందమూరి తారకరత్న... పాల్గొన్నారు. అదే సమయంలో కాస్త తొక్కిసలాట జరగడంతో...  నందమూరి తారకరత్న కు బీపీ ఎక్కువ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ తరుణంలోనే ఆయన మరణించారు.  2023 సంవత్సరం జనవరి 27వ తేదీన... నందమూరి తారకరత్నకు గుండెపోటు రావడం జరిగింది. అయితే 22 రోజులపాటు మృత్యుతో పోరాడిన నందమూరి తారకరత్న 2023 ఫి బ్రవరి 18వ తేదీన మరణించారు.

 ఇక అప్పటికే ఆయనకు భార్య పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారి ఆలనా పాలన నందమూరి బాలయ్య ఇటు వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు. విజయసాయి రెడ్డికి దగ్గర బంధువే అలేఖ్య రెడ్డి. నందమూరి తారకరత్న మరణించిన తర్వాత ఆయన భార్య... అలేఖ్య రెడ్డి తరచూ... తన భర్తను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేది.

 అయితే తాజాగా అలేఖ్య రెడ్డి కూతురు..సారీ ఫంక్షన్ జరిగింది. అయితే ఈ సారి ఫంక్షన్ లో... నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదట. కేవలం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారట. అయితే దీనికి సంబంధిం చిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నందమూరి కుటుంబానికి అలేఖ్యరెడ్డిని దూరం చేసేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుట్రలు పడినారని.. నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: