వైయస్సార్సీపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, చెల్లెలు వైయస్ షర్మిల రగడ గురించి తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2019 వ సంవత్సరంలో జగన్ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చెల్లెలు షర్మిల పాత్ర ఎంతైనా ఉంది. కానీ ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైయస్ షర్మిల అన్న జగన్ రెడ్డికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఆనాడు జగన్ గెలవడానికి తల్లి విజయమ్మ, షర్మిల ఎంతగానో కష్టపడినప్పటికీ.... జగన్ వారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సైడ్ చేయడం జరిగింది. ఆ కారణంగానే వారు వైయస్సార్సీపి పార్టీని విడనాడడం జరిగింది.

ఈ నేపథ్యంలో వైయస్ కుటుంబంలోనే కలహాలు ఉన్నాయని బహిరంగంగానే రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. అదే అంశం 2024 లో జగన్ ఓడిపోవడానికి కారణాల్లో ఒకటిగా మిగిలింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అన్నాచెల్లెళ్ల మధ్య రణం షురూ అయింది. అయితే దానికి కారణం మళ్లీ జగనే అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన వారసులకి అందరికీ సమానంగా ఆస్తిని పంచుకోమని చెబితే, జగన్ అలాగే చేస్తానని మాట ఇచ్చి, తాజాగా మాట తప్పుతూ కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చెల్లెలు షర్మిల హర్ట్ అయింది.

ఈ సందర్భంగా షర్మిల వైయస్సార్ అభిమానులకు బహిరంగంగా ఓ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో షర్మిల ఆసక్తికరమైన అంశాన్ని నొక్కి వక్కాణించింది. మరి ముఖ్యంగా వైయస్సార్ అభిమానులు అపార్థం చేసుకోకూడదు అంటూ ఆ బహిరంగ లేఖని మొదలు పెట్టింది. ఈ ఉత్తరంలో జగన్ పై తనకున్న ప్రేమను తెలియజేస్తూనే, అన్న జగన్ రెడ్డి తనను ఎలా మోసం చేశాడు అనే అంశాన్ని మొత్తం రాసుకొచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వారు చెబుతున్న ప్రకారం ఆనాడు తన తండ్రి వైయస్సార్ చనిపోక ముందే ఆస్తి పంపకం జరిగిందని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది? తమ కుటుంబాలలోని వారికి అందరికీ సమానంగా ఆస్తి దక్కాలని చెప్పిన వైయస్సార్, వస్తే పంపకం చేయకుండానే హఠాత్తుగా మరణించాలని చెప్పుకొచ్చింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయినంతవరకు ఈ మాటలకే కట్టుబడి ఉన్నట్టే నటించాడని, ఆ తర్వాత మాట మార్చాడని షర్మిల వాపోయింది. కాబట్టి తాను ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని వదిలిపెట్టాను అనేది వైయస్సార్ అభిమానులు అర్థం చేసుకోవాలని సూచించింది. మరోవైపు ఈ లేఖలో అన్న జగన్ రెడ్డి తనపై చేసిన అకృత్యాలను సైతం ఎండ కట్టింది షర్మిల. దాంతో ఈ లేఖను చూసిన జగన్ రెడ్డి అభిమానులు షర్మిలపై విరుచుకుపడుతున్నారు. దారుణమైన మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే సగటు ప్రేక్షకులు మాత్రం షర్మిల మాటల్లో అంతరార్థం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: