ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు... ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి... ఇప్పటివరకు వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో... వైసిపి నేతలపై కేసులు పెట్టి... అరెస్టు చేయిస్తున్నారని... ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వైసిపి పార్టీ కూడా రియాక్ట్ కావడం జరుగుతుంది.

 అయితే తాజాగా...ఓ ఎల్లో మీడియా అధినేత  గురించి... వైసిపి సోషల్ మీడియా సంచలనం పోస్ట్ పెట్టింది. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. వివాదాస్పద పోస్ట్ పెట్టింది వైసిపి.  అలాంటి వ్యక్తికి టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని... సంచలన పోస్ట్ వదిలింది  వైసిపి పార్టీ. పక్క ఆధారాలతో... ఈ పోస్ట్ పెట్టినట్లు వివరించింది. దీంతో వైసిపి చేసిన ఆ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

 అయితే ఆ ఎల్లో మీడియా... అధినేత ఎవరు అనే దాని పైన... వైసీపీ పార్టీ ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఎల్లో మీడియా అధినేత.. అంటూ వ్యాఖ్యానించింది. అయితే... అదే ఎల్లో మీడియా చైర్మన్ కు... టీటీడీ పాలక మండలి పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడో డిసైడ్ అయ్యారట. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం లేదా జనసేన పార్టీ నుంచి కాకుండా ఎల్లో మీడియా అధినేతకు ఇవ్వాలని... చంద్రబాబు నాయుడు అనుకున్నారట.

 అయితే ఇంతలోనే... వైసిపి పార్టీ సోషల్ మీడియా ఈ బాంబు పేల్చింది. ఆ ఎల్లో మీడియా అధినేత గురించి.. సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో... ఎల్లో మీడియా అధినేతను దూరం పెట్టారట చంద్రబాబు నాయుడు. అలాగే టీటీడీ పదవి కూడా ఆయనకు ఇవ్వబోరని... అశోక్ గజపతి రాజుకు ఇస్తారని కూడా తెలుస్తోంది. టిటిడి పదవి పై  ఎల్లో మీడియా అధినేత... చంద్రబాబును  కలిసేందుకు ఎంత ప్రయత్నిస్తున్న... అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: