ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో... వైసీపీని.. అనేక సమస్యలు వేధిస్తున్నాయని చెప్పవచ్చు. వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు బయటికి వెళ్లడం... అలాగే వైసిపి లో ఉండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పై విమర్శలు చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది వైసిపి పార్టీ పదవులు అనుభవించి.. ఇప్పుడు జనసేనలోకి కూడా జంప్ అవుతున్నారు.

 
అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీ కష్ట కాలంలో ఉన్న నేపథ్యంలో... మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి మరోసారి లాగారు.  జూనియర్ ఎన్టీఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని.. గుర్తు చేస్తున్నట్లు... ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.  జూనియర్ ఎన్టీఆర్ను వాడుకొని వదిలేసింది చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని.

 
పార్టీ విజయం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని... ఆయనకు టిడిపి పార్టీ సభ్యత్వం కూడా.. ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. చంద్రబాబు వాడకం అలాగే కుట్రల గురించి... తోడల్లుడు ఒక పుస్తకమే రాశారని... సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఇదే తరహాలో... వెన్నుపోటు పొడిచారని కూడా మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.

 
నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టి... చలికాచుకోవడం చంద్రబాబు మానుకోవాలని ఫైర్ అయ్యారు. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక....  ఆయన చెల్లెలు వైయస్ షర్మిల అలాగే విజయమ్మ తో కేసులు వేయిస్తున్నారని చంద్రబాబు పై మండిపడ్డారు. అయితే పేర్ని నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో...ఏపీ ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు.  వైసీపీ కష్టకాలంలో జూనియర్ ఎన్టీఆర్  పేరును వాడుకొని... గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారని... ఇది ప్రజలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: