మన దేశంలో భూముల విలువలు గత కొన్నేళ్లలో ఊహించని విధంగా పెరిగిపోయాయి. జగన్, షర్మిల ఆస్తుల వివాదం గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అయితే జగన్ తన ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చారంటే భారతి వల్లే అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భారతి అంగీకరించకపోతే ఆస్తులు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం అయితే అయ్యేది కాదు.
 
భారతి ఔదార్యంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఆడపిల్లకు పెళ్లి తర్వాత పుట్టింటికి సంబంధించిన ఆస్తులతో సంబంధం ఉండదని మన దేశ సాంప్రదాయం చెబుతోంది. షర్మిల సైతం దీనికి అతీతం కాదని చెప్పవచ్చు. న్యాయపరమైన సమస్యల వల్ల ప్రస్తుతం షర్మిలకు ఇవ్వాలనుకున్న ఆస్తులను సైతం ఆమెకు ఇచ్చే పరిస్థితులు అయితే లేవు.
 
జగన్, భారతి షర్మిలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నా ఆమె మాత్రం జగన్ కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలను తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వైఎస్ భారతిని సైతం షర్మిల టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం కొసమెరుపు. భారతి విషయంలో షర్మిల తీరుకు, షర్మిల విషయంలో భారతి తీరుకు పొంతన లేదనే చెప్పాలి.
 
వైఎస్ భారతి మీడియా ముందుకు రాకపోయినా ఆమె షర్మిల భవిష్యత్తుకు మేలు చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ భారతిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఆమె మనస్సు మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారతి పొలిటికల్ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్ జగన్, వైఎస్ భారతి విషయంలో షర్మిల తప్పు మీద తప్పు చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. షర్మిల తీరులో రాబోయే రోజుల్లో అయినా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉందని వైఎస్సార్ అభిమానులు భావిస్తున్నారు. తాము కూడా జగన్ కే సపోర్ట్ గా నిలుస్తామని వాళ్లు చెబుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: