మాజీ సీఎం వైఎస్ జగన్ షర్మిల చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో షర్మిలను ఎప్పుడూ నిందించని జగన్ ఇప్పుడు ఆమెను టార్గెట్ చేయడం వెనుక అసలు వాస్తవాలు వేరేలా ఉన్నాయి. జగన్ బెయిల్ రద్దు లక్ష్యంగా షర్మిల అడుగులు పడుతుండటంతో జగన్ సైతం తెలివిగా అడుగులు వేయాల్సి వస్తోంది. అయితే జగన్ ను అలర్ట్ చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి కావడం గమనార్హం.
 
రాజారెడ్డి నుంచి జగన్ వరకు అందరికీ అడిటర్ గా పని చేసిన విజయసాయిరెడ్డి జగన్ కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరిందంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. షర్మిలది ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చని ఆమెది అధికారం కోసం తగాదా అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. షర్మిల ప్రెస్ మీట్లలో 95 శాతం జగన్ ను విమర్శించడానికే అని బాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల ప్రెస్ మీట్లు అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
 
షర్మిల చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారని విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు. జగన్ పై మహిళల్లో వ్యతిరేకత రావాలని బాబు మాట్లాడిస్తున్నారని జగన్ కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందని విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్ మరణానికి ముందు చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు రాలేదా అని విజయసాయిరెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం.
 
షర్మిల ప్రత్యర్థికి మేలు చేయడానికి సొంత అన్నకు అన్యాయం చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు అత్యంత దుర్మార్గుడని బాబుతో స్నేహం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడే జగన్, షర్మిలకు ఆస్తులు పంచారని చెల్లిపై ప్రేమతో జగన్ షర్మిలకు వాటా ఇస్తానని చెప్పినా రిటర్న్ గిఫ్ట్ గా షర్మిల ఏమిచ్చిందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: