ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా గత రెండు రోజుల నుంచి ఈ విషయాలు ఆంధ్రప్రదేశ్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం పైన వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా షర్మిలకి ఆస్తితగాదాలు కాదని అధికార తగాదాలు అంటూ ఆమెను విమర్శించడం జరిగింది.


షర్మిల ప్రెస్మీట్ పెట్టి తన తల్లి కన్నీళ్లు తుడవడానికి అని చెప్పినప్పటికీ కానీ అది చంద్రబాబు కోసం పెట్టింది అన్నట్టుగా తెలిపారు..ఆయన కళ్ళల్లో ఆనందం చూసేందుకు షర్మిల మీడియా ముందుకు వచ్చిందనే విధంగా మాట్లాడారు. గత కొంతకాలంగా వైఎస్ జగన్ను తిట్టడానికి ఆమె ప్రెస్ మీట్ లు పెడుతూ ఉన్నదని.. కేవలం తన అన్న సీఎం కాకూడదని ఆలోచనతోనే ఇలాంటి పనిచేస్తుంది అంటూ షర్మిల పైన విజయసాయిరెడ్డి తెలిపారు. 95% షర్మిల ప్రెస్ మీట్ లో జగన్ తిట్టడానికి పెట్టినట్టుగా అనిపిస్తోంది అంటూ తెలిపారు. వైయస్ మరణానికి కారణం కాంగ్రెస్ అయితే చంద్రబాబుతో చేతులు కలిపి తన సొంత అన్నని ఓడించడం చాలా బాధాకరమని తెలిపారు.


అలాగే రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమైన వారందరితో చేతులు కలిపావు షర్మిలా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించడం జరిగింది.. మహిళలలో జగన్ పైన వ్యతిరేకత తీసుకురావాలని షర్మిల ద్వారా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని.. కోటినర్ర మంది మహిళలకు అన్యాయం చేయని జగన్ చంద్రబాబు చెప్పగానే ప్రజలు నమ్ముతారా అంటే షర్మిల అని ప్రశ్నించడం జరిగింది. ఒకసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మ విమర్శన చేసుకోండి అంటూ తెలిపారు.. అంతేకాకుండా జగతి అనే పేరు తానే పెట్టానని జగతి అంటే జగన్ భారతి పేర్లు కలిసి వచ్చేలా పెట్టాను అంటూ తెలిపారు. అంతేకాకుండా ఎర్రమనాయుడు ఎలా మరణించారో తెలుసా ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటారంటూ హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: