
తెలంగాణ కులగణన కొద్ది రోజులుగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కుల గణన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. ఈ సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణ జనాభాలో 46.25 శాతం మంది అంటే సుమారుగా కోటి అరవై నాలుగు లక్షల మంది బీసీ వర్గాలకు చెందిన వారు వారు ఉన్నారు. వారి తర్వాత ఓసీ వర్గాలకు చెందిన వారు 18 శాతానికి కాస్త అటూ ఇటూ గా ఉన్నారు. వీరిలో ఓసీ ముస్లింలు రెండున్నర శాతం వరకూ ఉన్నారు. వీరిని తీస్తే హిందూ ఓసీలు కేవలం 15.79 శాతం మాత్రమే ఉన్నట్టు స్పష్ట మైంది.
ఇక తెలంగాణ రాష్ట్రం లో ఎస్సీ వర్గానికి చెందిన వారి సంఖ్య 17.43 శాతం కాగా .. అదే ఎస్సీల జనాభాను 61,84,319గా ఉందని తేలింది. ఇక ఎస్టీ వర్గాలకు చెందిన వారు 37,05,929 మంది ఉన్నారు. వీరి పర్సంటేజీ 10.45 %. ముస్లింల సంఖ్య 44,57,012 .. రాష్ట్ర జనాభా లో వీరి పర్సంటేజీ 2.56 శాతం గా ఉంది. అలాగే బీసీ ముస్లింలను ఓసీ ముస్లిం ల తో కలపకుండా విడిగా లెక్కించారు. వారి సంఖ్య 35,76,588 గా తేలింది. 10.08 % మొత్తం జనాభాలో వీరి శాతం. మొత్తంగా 96.9 శాతం తెలంగాణలో ఉన్న సర్వే చేశామని.. 3,54,77,554 మంది వ్యక్తుల వివరాలు తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక సర్వే చేస్తోన్న క్రమం లో లక్ష ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని.. మరో లక్షా అరవై ఎనిమిది వేల కుటుంబాలు తమ వివరాలు ఇవ్వడానికి నిరాకరించాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ప్రభుత్వం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లను ఖరారు చేసే ఉద్దేశంలో ఉంది. ఏదేమైనా ఈ కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టి ఆమోదించనున్నారు.