విజయసాయిరెడ్డి , జగన్ ఇద్దరు వేరువేరు కాదు .. జగన్ ఆర్థిక సామ్రాజ్యం స్థాపనలో దగ్గరుండి రాజకీయంగా ముఖ్యమంత్రి గా ఎదిగే వరకు ప్రతి పనిలో అడుగులో విజయసాయిరెడ్డి పాత్ర ఎంతో ఉంటుంది .. ఇక దాన్ని మర్చిపోలేరు .. జగన్ అది మర్చిపోయినట్లు ఉంటున్నట్టు ఆ పార్టీలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. విజయ్ సాయి రెడ్డి పార్టీకి , పదవికి రాజకీయ సన్యాసం ప్రకటించారు .. అది జగన్ లండన్ లో ఉన్నప్పుడు జరిగిపోయింది .. అయితే పార్టీకి మాత్రం జగన్ వచ్చాక ఆయనతో మాట్లాడి రాజీనామా ప్రకటించాలనుకున్నారు .. అందుకే రాజ్యసభకు రాజీనామా చేసిన పార్టీకి మాత్రం జగన్ వచ్చేవరకు రాజీనామా చేయలేదు.
 

అయితే ఇప్పుడు జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా ఒకసారి కలవాలని విజయ సాయి రెడ్డి ప్రయత్నించారు .. ఈ మేరకు బెంగళూరులో కలిసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి .. మీడియాకు తెలియకుండా వ్యక్తిగతంగా ఆయనను కలిసి మాట్లాడాలని భావించారు కానీ జగన్ అవకాశం ఇవ‌క్క పోవటంతో ఆయన సోషల్ మీడియాలోనే వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .. తనతో ఇంతకాలం ప్రయాణించి తన ఎదుగుదల పత్రంలో తన వెంట ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కనీసం ఆయన్ను పలకరించే ప్రయత్నం చేయకపోవడం వైసిపి వర్గాలను కూడా ఆలోచింప చేస్తుంది.

 

అలాగే విజయసాయిరెడ్డి రాజీనామా వెనక ఎవరికి తెలియని వ్యవహారాలు చాలా జరిగాయని కూడా అంటున్నారు .. విజయసా రెడ్డి రెండోసారి రాజ్యసభ స్థానం వస్తుందని ఎవరు అనుకోలేదు .. అందరూ రాదని అనుకున్నారు .. అయితే భారతీ రెడ్డితో చెప్పించుకుని ఆయన రెండోసారి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని అంటారు.. అందుకే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సీటు వచ్చినప్పుడు రాజీనామా చేసినప్పటి కూడా భారతీ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు .. ఇక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చిందో కానీ జగన్ విజయసాయిరెడ్డి ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే అంతగా కూడా ఎవరు ఎదురుపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: