ఏపీలో రాజ‌కీయాలు మ‌రోసారి హాట్ హాట్ గా మారనున్నాయి. వైసీపీ కి చెందిన ఇద్ద‌రు కీల‌క ఎంపీ లు బీజేపీకి జై కొట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ?  ఎవ్వ‌రూ ఊహించ లేరు. అందులోనూ ఏపీ లో 2019 లో వైసీపీ అధికారం లోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి అదికార పార్టీ లోకి జంపింగ్ జ‌పాంగ్ లు ఓ రేంజ్ లో జ‌రుగుతున్నాయి. వైసీపీ అధికారం లో ఉన్న‌ప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది కీల‌క నేత‌లు .. సీనియ‌ర్లు .. చివ‌ర‌కు ఎమ్మెల్యేలు గా ఉన్న వారు సైతం టీడీపీని వీడి వైసీపీ లోకి వెళ్లి అక్క‌డ కూడా ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు.


ఇక ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చింది. వైసీపీ నుంచి కూట‌మి పార్టీలు అయిన టీడీపీ .. జ‌న‌సేన‌లోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ కి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్న వారితో పాటు ప‌లువురు ఎమ్మెల్సీ లు కూడా చివ‌ర‌కు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి జ‌గ‌న్ కు దూరం అయ్యారు. ఇప్పుడు ఈ లిస్టులో నే మ‌రో ఇద్ద‌రు ఎంపీ లు కూడా ఆ పార్టీని వీడి బీజేపీ లో చేరే ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.


సీమ‌కు చెందిన లోక్‌స‌భ స‌భ్యుడు ఒక‌రు పార్టీ మారే దిశ‌గా పావులు క‌దుపుతున్నా రట‌. ఈయ‌న కుటుంబంపై కేసులు వ‌ల‌యం న‌డుస్తోంది. త‌మ‌ను కాపాడుకు నేందుకే  ఈ పెద్ద కుటుంబం బీజేపీని సంప్ర‌దించింద‌ని సీమ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ కుటుంబాన్ని పార్టీ లో చేర్చుకునే విష‌యంలో బీజేపీ పెద్ద‌లు సాగ‌దీత ధోర‌ణి లో ఉన్నార‌ట‌. ఇక మ‌రో ఎంపీ ఓ ప‌ద‌వి ఆశించి బీజేపీ లో చేరే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని బీజేపీ పెద్ద‌ల దృష్టికి తీసుకు వెళ్ల గా వారు కూడా ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: